ఏపీ సరే….తెలంగాణలో కేసీఆర్‌కు ఇబ్బందే !

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు తొలి అడుగు అని ప్రచారం జరుగుతున్న ఓ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సంగిరేణిని ముందు పెట్టాలనుకుంటోంది. అసలు నిజంగా బిడ్ పొందాలనే ఆలోచన తెలంగాణ సర్కార్ కు లేదని.. కేవలం బిడ్ లో పాల్గొంటే.. కేంద్రంపై తమ పోరాటం.. ఏపీలోకి తమ ఎంట్రీ సాఫీగా సాగుతుందన్న అంచనాకు వచ్చింది. అయితే ఇలా పాల్గొనడం వల్ల హోంగ్రౌండ్‌లో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రం ఊహించలేకపోతున్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో మూతపడ్డ పరిశ్రమలను తాము అధికారంలోకి వస్తే వంద రోజు హామీలు ఇచ్చారు. నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్లు, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్ఎంటీ, హెచ్‌‌సీఎల్, ఐడీపీఎల్.. ఇవేమీ తెరవలేదు. బయ్యారం ఉక్కు కోసం ” కేంద్రం గీంద్రం జాంతానై .. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ జేపిచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తా’అని ప్రకటించారు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ వేయాలని కేసీఆర్ అనుకోవడం ఖచ్చితంగా రాజకీయ వ్యూహమే. అందులో సందేహం లేదు. కేంద్ర సంస్థల్ని.. మోదీ సర్కార్ ప్రైవేటు పరం చేస్తోందని.. వాటిని తాము కాపాడతామని కేసీఆర్ నిరూపించాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆయన పణంగా పెడుతోంది తెలంగాణ ప్రజల సొమ్ము. ఆ బిడ్ వస్తుందా రాదా అన్న సంగతి పక్కన పెడితే.. వస్తే మాత్రం ఖచ్చితంగా వదిలించుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడి వరకూ వెళ్లకపోయినా ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరిగే చర్చ వేరు. తెలంగాణలో ఎన్నో ఉండగా.. చివరికి మాటిచ్చినవే ఎన్నో ఉండగా.. ఎక్కడో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు కేసీఆర్ కంగారు పడుతున్నారనే.

తెలంగాణ ప్రజల్లోనూ ఇటీవల కేసీఆర్ రాజకీయంపై చర్చ జరుగుతోంది. ప్రగతి భవన్ లో ఇతర రాష్ట్రాల వారికి విందులు ఇస్తున్నారు కానీ తెలంగాణ సామాన్య ప్రజలకు ఎంట్రీ ఉండదు. పైగా తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆయన దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలనుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయం పై తేడా జరిగితే.. .. ప్రజలలో మరింత వ్యతిరేక ప్రబలే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో వచ్చే రాజకీయ లబ్ది కన్నా తెలంగాణలో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close