హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న కృతి సనన్‌ సిస్టర్‌!

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హీరోల వారసులుగా, హీరోయిన్ల వారసులుగా చాలా మంది పరిచయమయ్యారు. కానీ, అందులో సక్సెస్‌ అయింది మాత్రం కొంతమందే. హీరోయిన్ల కూతుళ్ళు హీరోయిన్లుగా ఇండస్ట్రీకి వచ్చింది తక్కువనే చెప్పాలి. కానీ, హీరోయిన్ల చెల్లెళ్ళు హీరోయిన్లుగా పరిచయమై సక్సెస్‌ అయినవాళ్ళు చాలా మంది వున్నారు. అలా సక్సెస్‌ అయిన వారిలో అలనాటి నటిమణిలలో పద్మిని- రాగిణి – లలిత లు, షావుకారు జానకి – కృష్ణ కుమారి లు, తర్వాత అంబిక – రాధా లు, జయ సుధ – సుభాషిని లు, భానుప్రియ – శాంతిప్రియ, రాధిక – నిరోష, నగ్మా- జ్యోతిక లు వున్నారు. ఈ జనరేషన్‌కి వస్తే ఆర్తి అగర్వాల్‌ చెల్లెలు అదితి అగర్వాల్‌, కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌, సంజన చెల్లెలు నిక్కీ గల్రాని, విదీష చెల్లెలు శాన్వి…ఇలా చాలా పెద్ద లిస్టే వుంది.
ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మరో హీరోయిన్‌ చెల్లెలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మహేష్‌తో ‘1 నేనొక్కడినే’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతి సనన్‌ చెల్లెలు నుపూర్‌ సనన్‌ హీరోయిన్‌గా రాబోతోంది. ఇంతకుముందు ఏ సినిమాలోనూ నటించని నుపూర్‌ సడన్‌గా హీరోయిన్‌గా ఎలా ఎంటర్‌ అవుతోందీ అంటే దానికి ఓ కథ వుంది.
అదేమిటంటే ఈమధ్య షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘దిల్‌వాలే’ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కృతి సనన్‌ కూడా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం కోసం అజిత్‌ సింగ్‌ – అంతర మిత్ర కలిసి పాడిన ‘జనమ్‌ జనమ్‌’ అనే పాట చాలా పాపులర్‌ అయింది. ఈ పాటను కృతి సనన్‌ చెల్లెలు నుపూర్‌ సనన్‌ పాడి ఈ సాంగ్‌ మేకింగ్‌తో కూడిన వీడియోను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. కేవలం పది రోజుల్లోనే ఈ పాటకు ఒక మిలియన్‌ పైగా వ్యూస్‌ వచ్చాయి. నుపూర్‌ సనన్‌ సింగరే కాకుండా మంచి అందగత్తె కావడంతో దర్శకనిర్మాతల దృష్టి ఆమెపై పడింది. దాంతో ఆమెకు హీరోయిన్‌ అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. అక్కలాగే తను కూడా హీరోయిన్‌ అయిపోవాలని ఈమధ్యే డిసైడ్‌ అయ్యిందట నుపూర్‌. దానికి కృతి ప్రోత్సాహం కూడా తోడవడంతో త్వరలోనే నుపూర్‌ సనన్‌ హీరోయిన్‌ తెరంగేట్రం చేస్తుందని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close