ఈ మూడు రోజులూ “హై” టెన్షన్ డేస్..!

అమరావతి విషయాన్ని ఏపీ సర్కార్‌ క్లైమాక్స్‌కి తీసుకొచ్చింది. అదే సమయంలో…విపక్షాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో.. హైపవర్ కమిటీ… శుక్రవారం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో భేటీ కానుంది. ఇప్పటికే మూడు సార్లు హైపవర్ కమిటీ భేటీ అయింది. కమిటీ సభ్యుల అభిప్రాయాలతో.. నివేదికను ఫైనల్ చేసే అవకాశం ఉంది. నివేదికలో ఏమి ఉండాలన్నది.. ఇప్పటికే.. ప్రభుత్వానికి క్లారిటీ ఉంది కాబట్టి.. రైతులకు ఏం చేయాలన్నదానిపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తే.. వచ్చే న్యాయపరమైన వివాదాలపైనా హైపవర్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. ఇరవయ్యో తేదీన ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలని ఇప్పటికే తేదీని ఖరారు చేసినందున… హైపవర్ కమిటీ భేటీ చివరిది కావడం ఖాయంగా కనిపిస్తోంది.

అదే సమయంలో.. రాజధాని రైతులు తమ అభిప్రాయాలు చెప్పవచ్చు అంటూ.. ప్రభుత్వం విధించిన గడువు కూడా రేపటితో ముగియనుంది. మరో వైపు.. విపక్ష పార్టీలు..  అమరావతి పోరాటం విషయంలో స్పీడు పెంచుతున్నాయి. గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని.. చంద్రబాబు, అమరావతి జేఏసీ నిర్ణయించాయి. రాజకీయ దురుద్దేశంతోనే అమరావతిని దెబ్బతీస్తోందని చంద్రబాబు, జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వైపు అమరావతిని కాపాడుకుంటామంటూ.. బీజేపీ, జనసేన కలిసిపోవడం.. మరో వైపు రాష్ట్ర వ్యాప్త పోరాటంతో.. ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

హైకోర్టులోనూ… అమరావతి ఆందోళనలపై విచారణ జరగనుంది. అమరావతిలో 144 సెక్షన్ విధింపు, పోలీసుల తీరును తప్పుబడుతూ హైకోర్టులో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు… పోలీసులపై చర్యలకు ఆదేశించింది. పిటిషన్లపై శుక్రవారమే విచారణ జరగనుంది. ఈ పరిణామాలన్నింటితో.. శుక్రవారం.. అమరావతిలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే మూడు రోజుల పాటు.. అమరావతిలో టెన్షన్ .. టెన్షన్‌గా గడవనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close