లావ‌ణ్య త్రిపాఠీ ఫైన్ క‌ట్టిందా? లేదా?

ఈమ‌ధ్య లావ‌ణ్య త్రిపాఠీ కొద్ది పాటి ఇబ్బందుల్లో చిక్కుతుంది. తెలుగులో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన 100 % సినిమాని త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. క‌థానాయిక‌గా అవ‌కాశం లావ‌ణ్య త్రిపాఠీకి వ‌రించింది. కొన్ని రోజులు షూటింగ్ అవ్వ‌గానే ఈ టీమ్ నుంచి లావ‌ణ్య కావాల‌నే త‌ప్పుకుంది. దాంతో త‌మిళ నిర్మాత‌లు లావ‌ణ్య‌పై ఫైర్ అయ్యారు. ఆమెపై త‌మిళ నిర్మాత‌ల సంఘంలో ఫిర్యాదు చేశారు. ‘మా’ లోనూ ఆమెపై కంప్లైంట్ న‌మోద‌య్యింది. లావ‌ణ్య స్థానంలో మ‌రో క‌థానాయిక‌ని ఎంచుకుని, ఆమెపై రీషూట్లు చేయ‌డం వ‌ల్ల తాము చాలా న‌ష్ట‌పోయామ‌ని, అందుకు ప్ర‌తిగా రూ.2 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని త‌మిళ నిర్మాత డిమాండ్ చేశారు. లావ‌ణ్య కూడా కొంత మొత్తం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించింద‌ని వార్త‌లొచ్చాయి.

వీటిపై లావ‌ణ్య త్రిపాఠీ స్పందించింది. తానేం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌లేద‌ని, నిర్మాత‌తో కూర్చుని మాట్లాడుకుని శాంతియుతంగానే ఈ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకున్నాన‌ని క్లారిటీ ఇచ్చింది. ”రెండు కోట్లు, మూడు కోట్లు అని ఏవేవో వార్త‌లు రాశారు. నా పారితోషిక‌మే అంత ఉండ‌దు క‌దా. అలాంటిది అంత మొత్తం ఎలా చెల్లిస్తాను? ఆ వివాదం త‌ర‌వాత నేను నిర్మాత‌ని క‌లిశాను. మేం కూర్చుని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలాంటి గొడ‌వ‌లూ లేవు. నేను డ‌బ్బులేం ఇవ్వ‌లేదు” అని చెప్పేసింది లావ‌ణ్య‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close