మహేష్ సినిమా హిందీలో కూడా..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్లో ఉన్నాడు. మొన్నటిదాకా రెగ్యులర్ షూటింగ్ చేసిన మహేష్ సినిమాకి కొంత గ్యాప్ ఇచ్చి హాలీడేస్ లో ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వేసొచ్చాడు. వచ్చి రాగానే మళ్లీ షూటింగ్ షురూ చేసేశాడనుకోండి. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేసే సినిమా దాదాపు మురుగదాస్ డైరక్షన్లో అని ఫిక్స్ అయినట్టే.. కమర్షియల్ పంథాలోనే సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఇవ్వడంలో మురుగదాస్ చాలా గొప్ప నైపుణ్యం ఉంది.

ఈసారి మహేష్ తో న్యాయ వ్యవస్థకు సంబంధించిన కథతో రంగంలో దిగుతున్నాడు మురుగదాస్. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేసేదుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే తెలుస్తున్న కథనాల ప్రకారం యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సినిమాను హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

కేవలం సౌత్ సినిమాలే చేసినా మహేష్ కు ఆల్ ఓవర్ ఇండియా మంచి మార్కెట్ ఉంది. ఇక ఓవర్సీస్ లో అయితే మహేష్ మొదటి స్థానంలోనే ఉంటాడు. మొన్నీమధ్య బాహుబలి వచ్చి ఓవర్సీస్లో బీట్ చేసింది కాని మహేష్ సినిమా అంటే మన దగ్గర ఎంత క్రేజో ఓవర్సీస్లో కూడా అంతే క్రేజ్. 2016 ఏప్రిల్ 12న ముహుర్తం పెట్టబోతున్న మహేష్ మురుగదాస్ సినిమాను పారస్ జైన్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు. 80 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబడుతుందని అంచనా. మరి సినిమాకు సంబంచిన మిగతా అప్ డేట్స్ మరి కొద్దిరోజుల్లో తెలియనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close