సిట్ అధికారుల ముందు హాజరయిన మల్లాది విష్ణు

కల్తీ మద్యం కేసులో తొమ్మిదవ నిందితుడిగా ఉన్న విజయవాడ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు బుదవారం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ‘సిట్’ అధికారుల ముందు ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఆయన కుటుంబీకులకు చెందిన స్వర్ణబార్‌ అండ్‌ రెస్టారెంటులో కల్తీమద్యం తాగి నెల రోజుల క్రితం ఐదుగురు వక్తులు చనిపోయారు. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దానిలో మల్లాది విష్ణు పేరు కూడా చేర్చడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన పెట్టుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్ని విజయవాడ కోర్టు తిరస్కరించి తక్షణమే పోలీసుల ముందు లొంగిపొమ్మని ఆదేశించడంతో ఆయన మళ్ళీ విజయవాడ తిరిగివచ్చేరు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ తానేమీ ఎక్కడికీ పారిపోలేదని తీర్ధయాత్రలకి వెళ్ళానని చెప్పుకొన్నారు. అయితే అది అబద్దమని అందరికీ తెలుసు. తనపై కేసు నమోదు అయ్యిందని తెలిసిన తరువాతే అయన హటాత్తుగా మాయం అయిపోయారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారనే సంగతి తెలిసినప్పటికీ ఆయన తిరిగిరాలేదు. కోర్టు ఆదేశించడం చేత తప్పనిసరి పరిస్థితుల్లో అజ్ఞాతం వీడి పోలీసుల ముందు లొంగిపోవలసివచ్చిందని స్పష్టం అవుతోంది. నెల రోజుల తరువాత తిరిగి వచ్చి “ప్రజాప్రతినిధిగా పనిచేసిన తనకు చట్టం, న్యాయ వ్యవస్థల పట్ల అపారమయిన గౌరవం ఉందని, విచారణకు సహకరిస్తానని” చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదే పని ఆయన మొదటే చేసి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close