ముద్రగడ ఆ రూ. 10వేల కోట్లకు రాజీ పడిపోతున్నారా..?

“రూ. 10వేల కోట్లు కాదు.. రూ. 20వేల కోట్లు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేటాయిస్తాం. ముఖ్యమంత్రి పదవి కాపులకు ఇచ్చేయండి..!” ఇదీ .. కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని.. ప్రకటించి.. ఏడాదికి రూ. 2వేల కోట్ల చొప్పున కాపులకు ఫండ్ ఇస్తామన్నప్పుడు.. ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు.. రాజకీయం అయిపోయింది. ఎన్నికలు అయిపోయాయి. తీరా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తాను చెప్పిన ఆ రూ. 10వేల కోట్లకు ముద్రగడను బాధ్యడ్ని చేయబోతున్నారు. అంటే పార్టీలో చేర్చుకుని కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారట.

గోదావరి జిల్లాల్లో వైసీపీకి కాపు ఓట్లు పడటం వెనుక ముద్రగడ..!

కాపుల‌కు ఐదు శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగ‌డ ప‌ద్మనాభం మొన్నటి ఎన్నిక‌ల‌ వేళ అనూహ్యంగా మౌనం వహించారు. కాపు వ‌ర్గం మొత్తం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే మ‌ద్దతుగా నిలుస్తార‌ని కొంత మంది. . కేంద్రం ఆమోదించిన అగ్రవ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చే రిజ‌ర్వేష‌న్లలో అయిదు శాతం కాపుల‌కు ఇవ్వడంతో వారంతా చంద్రబాబు వైపే ఉంటార‌ని మ‌రి కొంద‌రు అంచ‌నా వేసారు. అయితే, అనూహ్యంగా కాపుల్లో అధిక శాతం వైసీపీ వైపే మొగ్గు చూపారు. నిజానికి జగన్ కాపులను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయలేదు. కాపు రిజర్వేషన్ సాధ్యం కాదని తేల్చడంతో పాటు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించారు. అయినా కాపు వర్గం ఓట్లు వైసీపీకి బాగానే పడ్డాయి. దీనికి ముద్రగడ సహకారం ఉందని అంటున్నారు. వైసీపీ కోసం ఆయన లోపాయికారీగా పని చేశారని ప్రచారం జరిగింది.

కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజ్యసభ పదవి ఆఫర్ ఇచ్చిన వైసీపీ..!

కాపు ఓటు బ్యాంక్‌ను సుస్థిరం చేసుకునేందుకు… వైసీపీ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా ముద్రగడను అధికారంగా పార్టీలో చేరాలని ఆహ్వానించింది. చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వ్యక్తిగతంగా తీవ్ర అవమానాల పాలు చేసారని….దానికి విరుగుడు కోరుకుంటున్నట్టు వైసీపీ నేతలకు ముద్రగడ చెప్పినట్లు సమాచారం. అందుకే ముద్రగడకు కాపు కార్పొరేషన్ పోస్ట్ .. దానికి ఏడాదికి రూ. 2వేల కోట్ల బడ్జెట్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టారు. అంతే కాకుండా వచ్చే టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా వైసిపి తరుపున పార్లమెంట్ కు పంపుతామని పద్మనాభం కు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఈ ప్రతిపాదనపై ముద్రగడ సానుకూలంగానే ఉన్నారని అంటున్నారు.

కాపుల్ని ఓటు బ్యాంకుగా చేసుకోవడమే జగన్ లక్ష్యం..?

టీడీపీ..జ‌న‌సేనలకు కాపు వ‌ర్గాన్ని పూర్తిగా దూరం చేసేందుకే జగన్ ఈ ఆపరేషన్ చేపట్టారంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన తమకు అడ్డుగా మారొచ్చనీ, దానికి విరుగుడు ఇదేనని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. పైగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ప్రయోగం తరవాత కాపులకు స్వంతంగా అధికారం అనే కల చెదిరిపోయిందనీ….వాళ్ళు ఇకపై ఏదో పక్షాన నిలవాల్సిందేననీ…అది వైసీపీనే అయ్యేలా చూడాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారంటున్నారు. ముద్రగడను వైసీపీకి గూటికి చేర్చే క్రమంలో బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. త్వరలోనే ముద్రగడ.. వైసీపీలో చేరడం ఖాయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close