నడ్డాతో భేటీ కానున్న మైహోం రామేశ్వరరావు !

కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకుని.. టీవీ 9 చానల్‌ను రవిప్రకాష్‌ను వెళ్లగొట్టడంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోం రామేశ్వరరావు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు . నోవాటెల్ హోటల్‌లోనే ఈ భేటీ జరగనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మైహోం దశ తిరిగింది. పెద్ద ఎత్తుల స్థలాలు లభించాయి. వెంచర్లు వేశారు. అయితే కేసీఆర్‌తో.. ఇటీవల దూరం పెరిగింది. దానికి కారణం చినజీయర్ స్వామి ఆశ్రమంలో కేసీఆర్‌కు జరిగిన అవమానం.

ఎంత సహకరించినా.. మోదీ పాల్గొనే కార్యక్రమంలో శిలాఫలకంపై కేసీఆర్ పేరు లేకుండా చేశారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిన కారణంగా కేసీఆర్ వారితో సంబంధాలు తెంపేసుకున్నారు. అప్పట్నుంచి మాటల్లేవని చెబుతున్నారు. అయితే ఇలా చిన్న విషయంతోనే వారి మధ్య సంబంధాలు తెగిపోనంత బలంగా ఇతర సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తూ ఉంటారు. కానీ రామేశ్వరరావు ఇప్పుడు బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు.

ఆయన పలుమార్లు రహస్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారన్న ప్రచారం ఉంది. ఈ సారి నేరుగా కలవబోతున్నారు. జేపీ నడ్డాతో నోవాటెల్‌లో ఈ భేటీ జరగనుంది. సహజంగానే ఈ అంశం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తమపై బీజేపీ కుట్రలు చేస్తుందని తెలిసి కూడా ఆ పార్టీ పెద్దలను రామేశ్వరరావు కలవడం.. కేసీఆర్‌తో పూడ్చుకోలేని ఆగాధాన్ని ఏర్పర్చుతుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close