ఏబీ సస్పెన్షన్‌పై “స్టే”కు క్యాట్ నో..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్‌ చట్ట వ్యతిరేకమని.. వెంటనే ఎత్తివేస్తూ ఆదేశాలివ్వాలని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పెట్టుకున్న పిటిషన్ పై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది క్యాట్‌ను కోరారు. అయితే.. స్టే ఇవ్వడానికి క్యాట్ నిరాకరించింది. ప్రభుత్వం తరపున వాదించడానికి వచ్చిన లాయార్ ప్రకాష్ రెడ్డిపై మాత్రం.. ప్రశ్నల వర్షం కురిపించింది. డీజీ స్థాయి అధికారిని కేంద్రం అనుమతి లేకుండా ఎలా సస్పెండ్‌ చేశారని ప్రశ్నించింది. సస్పెన్షన్‌ తర్వాత హోంశాఖకు సమాచారం ఇచ్చారా అని క్యాట్ న్యాయమూర్తి ప్రశ్నించారు.

అయితే.. తమకు ఉన్న అధికారంతోనే.. డీజీ స్థాయి అధికారి అయినప్పటికీ.. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది క్యాట్‌కు తెలిపారు. ఐపీఎస్ అధికారికి 8 నెలలుగా జీతం ఎందుకు ఇవ్వలేదని క్యాట్ ప్రశ్నించారు. మొత్తం వివరాలు చెప్పాలంటే…తనకు వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది క్యాట్ ను కోరారు. దాంతో.. విచారణను.. ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఎందుకు సస్పెండ్ చేసిందో.. ప్రభుత్వం ఎలాంటి వివరాలు చెప్పకపోవడం వల్లనే.. సస్పెన్షన్ పై క్యాట్ స్టే ఇవ్వలేదని ఏబీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర సర్వీసులో ఉన్న అధికారుల్ని ఏపీ సర్కార్ సస్పెండ్ చేస్తూండటం.. వారు క్యాట్‌లో పిటిషన్లు వేస్తే.. వివరాలు లేవని న్యాయవాదులు చెప్పడం కామన్ గా మారింది. జాస్తి కృష్ణకిషోర్ అనే ఐఆర్ఎస్ అధికారి విషయంలోనూ అలాగే జరిగింది. జీతం చెల్లించమని క్యాట్ ఆదేశించిన చెల్లించలేదు. చివరికి సీఎస్‌ను పలిపిస్తామని హెచ్చరించడంతో అప్పటికప్పుడు జీతం ఇచ్చినట్లుగా క్యాట్ కు తెలిపారు. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close