టిడిపి, వైఎస్ఆర్సిపి లాగా జనసేన పార్టీ లెక్కలు వేసుకోదు అన్న పవన్ కళ్యాణ్

ఎన్నికల అయిపోయిన కొద్ది గంటలలోపే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి, తమ పార్టీ 120 స్థానాలలో గెలుపు సాధిస్తుందని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా మర్నాడు తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తమ పార్టీ అలాంటి లెక్కలు వేసుకోదు అని స్పష్టం చేశారు.

జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల తో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే మిగతా పార్టీల లాగా తమకు ఎన్ని సీట్లు వస్తాయన్న లెక్కలు వేసుకోవడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం లేదని, ఎన్నికల్లో పోటీ సందర్భంగా యువ అభ్యర్థులకు ఎదురైన అనుభవాలు ఏంటి, ప్రజలలో ఎంతవరకు మార్పు తీసుకు వచ్చాము, ప్రజలకు మరింత మేలు చేయడానికి పార్టీ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి లాంటి అంశాల మీద చర్చించడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ వారితో స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ రోజుకో గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని, గ్రామస్థాయిలో సమస్యల జాబితా రూపొందించాలని, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడానికి ప్రయత్నించాలని, పార్టీకి అండగా నిలబడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని సూచించారు. మొత్తానికి ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపే దగ్గర నుండి, డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు ఎదుర్కొనే దగ్గర నుండి, ఎన్నికలయ్యాక కూడా కొత్త తరహా రాజకీయాలను పవన్ కళ్యాణ్ కొనసాగించడం ముదావహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close