పవన్‌కు బెదిరింపులు సరే – మహిళల మాయంపై నిజాలేమిటి ?

వాలంటీర్లు మహిళల సమాచారం తెలుసుకుని అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారని దాని వల్ల పధ్నాలుగు వేల మంది మహిళలు గత నాలుగేళ్లలో అదృశ్యమయ్యారని పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనాత్మకం అయ్యాయి. నిజంగానే ఇన్ని వేల మంది మహిళలు అదృశ్యమయ్యారా లేదా అన్నది ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. తనకు కేంద్ర నిఘా వర్గాలే చెప్పాయని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఈ వ్యవహారం సున్నితమైనది కావడంతో.. ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. దీన్ని రాజకీయ పరమైన వివాదం చేస్తే తప్ప.. మరింత విస్తృతమైన చర్చ జరగకుండా అడ్డుకోలేమని అంచనాకు వచ్చారు.

అందుకే మొదట వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తలను రంగంలోకి దింపారు. పలు చోట్ల పవన్ కల్యాణ్ ఆరోపణలలు వచ్చిన పత్రికా కాపీలను తగులబెట్టారు. మరో వైపు మంత్రులు ఉలిక్కి పడ్డారు. పవన్ పై ఎప్పటిలాగే వ్యక్తిగత విమర్శలు పెంచారు. మరో వైపు మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రంగంలోకి దిగారు. మహిళలు అదృశ్యమయ్ారని ఆరోపణలు చేసినందుకు నోటీసులు ఇచ్చారు. అసలు ఈ విషయంలో మహిళా కమిషన్ కు సంబంధం ఏమిటో ఎవరికీ అంతు చిక్కదు. అందులో నిజం లేకపోతే.. గత నాలుగేళ్లలో పధ్నాలుగు వేల మంది మహిళలు అదృశ్యం కాలేదని రికార్డులు బయట పెడితే.. పవన్ కు సమాధానం ఇచ్చినట్లవుతుంది.

మొత్తంగా ఏపీలో ప్రతి యాభై ఇళ్లకు ఉన్న ఓ వాలంటీర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వారి డేటా అంతా వారి దగ్గర ఉంటుంది. ఏ ఆధారం లేని మహిళలు ఇలా నిజంగానే మాయమైతే మాత్రం ఖచ్చితంగా వారిని.. వారివెనుక ఉన్న ముఠాలను అనుమానించాల్సిందే. అందుకే ఈ అంశంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వీటిలోని నిజాలను రాష్ట్రం కాకపోతే.. కేంద్రం బయట పెట్టాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close