ప‌వ‌న్ ఛాన‌ల్ పెడుతున్నాడోచ్‌

2019 ఎన్నిక‌ల్లో పూర్తిస్థాయి పార్టీగా జ‌న‌సేన‌ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకొన్నా, లేకున్నా – ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం మాత్రం ఖాయం. ఎన్నిక‌లంటే మాట‌లు కాదు. బోల్డంత ప్ర‌చారం చేసుకోవాలి. త‌న‌ని నిత్యం మోసే ఓ ప‌త్రిక‌గానీ, ఛానెల్‌గానీ కావాలి. అందుకోసం ప‌వ‌న్ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేసిన‌ట్టు టాక్‌. త‌న త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకొనే మీడియా సంస్థ ఉంటే.. త‌న‌కు ఎన్నిక‌ల్లో ప‌బ్లిసిటీ ప‌రంగా చూసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు.

అయితే ఓ ఛాన‌ల్ స్థాపించ‌డానికి.. చాలా పెట్టుబ‌డి కావాలి. ప‌త్రిక పెట్ట‌డం అంటే ఇప్ప‌ట్లో తెవిలే వ్య‌వ‌హారం కాదు. అందుకే న‌ష్టాల్లో ఉన్న ఓ ఛానెల్‌ని కొనేసి… దానికి మ‌ర‌మ‌త్తులు చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అంత‌కంటే ముందే ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్‌ని క్రియేట్ చేయాల‌ని ప‌వ‌న్ ఆలోచిస్తున్నాడు. టీవీ ఛాన‌ల్ అంటే కోట్ల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారం. అదే యూ ట్యూబ్ అయితే.. సింపుల్ గా తెవిలిపోతుంది. అందుకే ముందు యూ ట్యూబ్ ఛాన‌ల్ లాంచ్ చేసి, దానికొచ్చిన రెస్పాన్స్ చూసి, అప్పుడు టీవీ ఛాన‌ల్ పెడ‌తాడ‌ట‌. మొత్తానికి ప‌వ‌న్ ఇప్పుడిప్పుడే రాజ‌కీయ నాయ‌కుడిగా ఆలోచించ‌డం మొద‌లెట్టాడు… మున్ముందు ప‌వ‌న్‌లోని రాజ‌కీయ నాయ‌కుడ్ని పూర్తి స్థాయిలో చూస్తామ‌న‌డంలో ఎలాంటి సందేహాలూ అక్క‌ర్లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close