రెండింతలు పెరిగిన “పోలవరం” భారం!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు 2015-16 సంవత్సరాన్ని బేస్ గా తీసుకుని లెక్కవేస్తే 36 వేల కోట్లరూపాయలు అవుతుందన్న అంచనాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. 2013 సంవత్సరం లెక్క ప్రకారం ఇది 16 వేల కోట్లరూపాయలే! ”నిర్మాణం ఖర్చులు పెద్దగా పెరగలేదు. అయితే భూముల విలువ పెరిగిపోవడం, ముంపు నిర్వాసితుల పునరావాసం చాలా ఖరీదైపోవడమే” ఇందుకు కారణమని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.ఏమైనా కేవలం 2 ఏళ్ళలో ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపుకి పైగా పెరిగిపోవడాన్ని సమర్ధించుకోవడం ఏ ప్రభుత్వానికైనా కొంత కష్టమే! రాజకీయ సమీకరణలనుబట్టే ఇందులో ఇబ్బంది పెరగడమో, పెరగకపోవడమో వుంటుంది.

రాజధానికోసం 33 వేల ఎకరాలను పూలింగ్ ద్వారా సమీకరించి దేశానికే ఆదర్శవంతంగా రాష్ట్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కి అదే పద్దతిలో భూమి సమీకరించవచ్చుకదా అని బిజెపి కూడా అనవచ్చు. ఆంధ్రప్రదేశ్ భూముల విలువను ఈ ఉదాహరణతో తెలుగుదేశం ఘనంగా చూపించవచ్చు. ”మీరు పాలనగాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూన్నందువల్లే ప్రజలు కూడా ధర పెంచేస్తున్నారు” అని తెలగుదేశాన్ని జగన్ దుమ్మెత్తిపోయవచ్చు.

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుని కేంద్రప్రభుత్వమే నిర్మించాలి. అప్పటి ఆంచనా ప్రకారం 16 వేల కోట్లరూపాయలకు కేంద్రం వందకోట్లు రూపాయలు మాత్రమే విడుదల చేసింది. ప్రాజెక్టుపై ముందుగా ఖర్చుపెట్టి తరువాత ఆబిల్లుల సొమ్ముని కేంద్ర ఆర్ధిక శాఖనుంచి రాబట్టుకోవచ్చని కేంద్రం తెలియజేసింది. 17 వేలకోట్లరూపాయల నగదులోటుతో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా ఎలా డబ్బుఖర్చుపెట్టగలదో మోదీగాని, అరుణ్ జైట్లీగాని, వెంకయ్యనాయుడుగాని, అసలు బిజెపిలో ఏజ్ఞాని అయినాగాని సూచించనేలేదు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఖర్చుపెట్టిన 5 వేలకోట్లరూపాయలూ చెల్లించాలన్న విన్నపానికి కేంద్రం నుంచి ఉలుకూ పలుకూలేదు.

ఈ నేపధ్యంలో నిపుణులు ఇచ్చిన ఖర్చుపెరుగుదల నివేదికను గురువారం నాడు మంత్రివర్గ సమావేశం రికార్డు చేసి ఆమోదించింది. తదుపరి చర్యగా పెరిగిన అంచనా వ్యయాల నివేదికను కేంద్రానికి పంపుతారు. 16 వేలకోట్లరూపాయలకే గతిలేదు 36 వేలకోట్లరూపాయలు వస్తాయా అన్న అనుమానం తెలుగుదేశానికి సరే బిజెపి రాష్ట్రనాయకులకు కూడా తలెత్తక తప్పని వాతావరణం వుంది.

గోదావరి తూర్పు, సెంట్రల్, పశ్చిమ డెల్టాల్లోని 10 లక్షల ఎకరాలల్లో మొదటి పంటకు వరదనుంచి రక్షణకు, రెండోపంటకు నిఖరమైన సాగునీటికీ పోలవరం ప్రాజెక్టు అనివార్యం. ఇందుకు మరో ప్రత్యామ్నాయం కూడాలేదు. ఈనేపధ్యంలో ప్రాజెక్టుపై బిజెపి తెలుగుదేశం పార్టీల మధ్య దాగుడుమూతలు ఉభయగోదావరి జిల్లాల ప్రజానీకానికి అసహనాన్ని రగిలించకముందే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కళ్ళుతెరవాలి. ”ప్రత్యేక హోదా”తోపాటు ”పోలవరం ప్రాజెక్టు” కూడా ప్రజల సెంటిమెంటు గామారకముందే నిర్మాణానికి నిధుల ప్రవాహం మొదలుకావాలి!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close