కారు నాలుగు వేల కిలోల బరువు ఉంటుంది.. ఆ కారు ఎక్కితే సింగయ్య అక్కడికక్కడే చనిపోవాలి. కానీ చనిపోలేదు కాబట్టి .. ఏదో జరిగింది …అని వైసీపీ పేటీఎం కార్యకర్తలు సోషల్ మీడియాలో లాజిక్కులు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు క్వాష్ పిటిషన్ లో జగన్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. అసలు ఆయన తన కారు కింద నలగలేదని వాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ రెడ్డి క్వాష్ పిటిషన్ లో ..చేసిన వాదనంతా.. ఇంత పిల్ల చేష్టలుగా వాదించి కేసు నుంచి బయటపడిపోదామని అనుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారు.
జగన్ రెడ్డి కారు కింద సింగయ్య పడిన దృశ్యాలు ఉన్నాయి. జగన్ కూడా అంగీకరించారు. తన కారు కింద పడ్డాడని తెలిసి.. అతని ఆరోగ్యన్ని కనుక్కుని చచ్చిపోయాడని తెలిసి పది లక్షలు ఇవ్వాలని అంబటి రాంబాబును ఆదేశించానని జగన్ స్వయంగా చెప్పారు. కానీ ఆ విషయాన్ని ఆయన దాచి పెట్టారు. వీడియో బయటకు వచ్చిన తర్వాతనే అంగీకరించడం ప్రారంభించారు. ఇప్పుడు తనకు సంబంధం లేదని వాదించడానికి ఆయన విచిత్రమైన కారణాలను.. సోషల్ మీడియా కార్యకర్తలు మిడిమిడి జ్ఞానంతో చేసే వాదనలను హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అక్కడ రోడ్ షో చేశారు. పోలీసుల సూచనలను పట్టించుకోలేదు. ఆ వృద్ధుడు కారు కింద పడిన తర్వాత అందరూ కలిసి ఆపి ..కారును వెనక్కి పంపి.. ఆ వృద్ధుడ్ని బయటకు తీసి.. పక్కన డివైడర్ చెట్ల మధ్యన పడేశారు. అప్పటికి జగన్ రెడ్డి.. కారు నుంచి బయటకు వచ్చి.. అభివాదాలు చేస్తున్నారు. అంత చేస్తూంటే ఆయనకు తెలియదా ?. జనాలను పిచ్చోళ్లను చేసినట్లుగా.. న్యాయస్థానానికీ గంతలు కట్టాలనుకుంటున్నారు.
జగన్ రెడ్డి తప్పు చేసింది నిజం. అది ప్రజల కళ్ల ముందు ఉంది. ఓ మనిషిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది కాకుండా…. కనీసం వైద్యం అందించకుండా.. కేసును తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేశారు. ఈ నిజాలన్నింటినీ న్యాయస్థానాలు చూస్తాయో లేదో కానీ.. ఇలాంటి నేరాలను సాంకేతిక అంశాలను చూపించి లైట్ తీసుకుంటే.. భవిష్యత్ లో అవే పెద్ద కేస్ స్టడీలు అవుతాయి. కారుతో హత్యలు చేయడానికి కారణం అవుతాయన్న ఆందోళన సహజంగానే అందిరిలో వస్తుంది.