పూర్ణ లేనిదే ప‌రి `పూర్ణ‌`0 కాదా??

చిత్ర‌సీమ‌లో బోలెడ‌న్ని సెంటిమెంట్లు. ప్ర‌తీ ఒక్క‌రికీ ఏదో ఓ సెంటిమెంట్ న‌డిపిస్తుంటుంది. ర‌విబాబుకీ చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. త‌న సినిమాలో ఏదో ఓ ఫ్రేమ్‌లో ఆయ‌న కూడా క‌నిపించ‌డం ఓ ఆన‌వాయితీగా మారింది. ఇప్పుడు `పూర్ణ‌` కూడా త‌న సెంటిమెంట్ లో భాగ‌మైపోయింది. `అవును` కోసం పూర్ణ‌ని హీరోయిన్‌గా తీసుకున్నాడు ర‌విబాబు. ఆసినిమా హిట్ట‌య్యింది. ఆ సెంటిమెంట్‌తోనే `అవును 2`, `ల‌డ్డూ బాబు`ల‌లోనూ పూర్ణ‌ని క‌థానాయిక‌గా తీసుకున్నాడు. రెండూ ఫ్లాపులే. కానీ ర‌విబాబు సెంటిమెంట్‌ని మాత్రం వ‌ద‌ల్లేదు. ఇప్పుడు `అదిగో`లోనూ ఆమెకు చోటిచ్చాడు. పూర్ణ కోసం ఓ ఐటెమ్ పాట డిజైన్ చేసి వ‌దిలాడు.

నిజానికి `అదిగో` సినిమా ఎప్పుడో పూర్త‌యిపోయింది. ఐటెమ్ పాట మాత్రం ఇప్పుడు షూట్ చేసి అతికించారు. ఇదంతా పూర్ణ కోస‌మే అని టాక్‌. ర‌విబాబు సినిమాల్లో ఐటెమ్ గీతాలుండ‌వు. ఈచిత్రానికి నిర్మాత అయిన సురేష్ బాబు కూడా ఇలాంటి ఎగ‌స్ట్రా వ్య‌వ‌హారాల‌కు దూరం. సినిమా క‌థ‌కి అవ‌స‌రం లేని ప‌నిని ఆయ‌న ఎప్పుడూ… ప్రోత్స‌హించ‌డు. కేవ‌లం ర‌విబాబు కోస‌మే ఐటెమ్ పాట‌కు ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. క‌థ‌లో ఐటెమ్ గీతానికి ఏమాత్రం ఛాన్సు లేక‌పోయినా పూర్ణ‌ని తీసుకొచ్చి ఓ పాట చేయించేశార‌ని తెలుస్తోంది. అదిగో ఓ పంది పిల్ల క‌థ‌. తెలిసిన మొహాలెవ‌రూ ఉండ‌రు. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల్ని జోడించ‌డానికే తొలిసారి ర‌విబాబు.. ఐటెమ్ గీతాల దారి ఎంచుకున్నాడేమో అనిపిస్తోంది. దానికి తోడు.. పూర్ణ‌కి కూడా ఏదో ఓ రోల్ ఇవ్వ‌నిదే.. ఆయ‌న సినిమా ప‌రిపూర్ణం అవ్వ‌డం లేదాయె. అందుకే… చివ‌రి నిమిషంలో ఈ మార్పుల‌కు పూనుకున్నాడు ర‌విబాబు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close