తెలకపల్లి రవి : చంద్ర యాత్రలపై చావ్లా ఆశ్చర్యం

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాన్ని మించి విదేశీ యాత్రలు చేస్తూ వాస్తవ సమస్యలు వాయిదా వేస్తున్నారనే విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. దేశంలోని సీనియర్‌ సంపాదకులలోఒకరుగానే గాక జాతీయ రాజకీయాలలో కూడా అనుభవజ్ఞుడైన ప్రభుచావ్లా ఇప్పుడు దీన్ని సోదాహరణంగా విమర్శించారు. విశేషమైన పాలనానుభవం కలిగిన చంద్రబాబు ఈ స్థాయిలో ఎందుకు తిరుగుతున్నారు? సింగపూర్‌కు మాత్రమే గాక జపాన్‌కు కూడా రెండుసార్లు వెళ్లివచ్చారు. అగ్రదేశాల నేతలు హాయిగా సేదదీరేందుకు మాత్రమే ఉపయోగించే దావోస్‌ ఆర్థిక శిఖరాగ్రసభకు ఎక్కడ లేని ప్రాధాన్యతనిచ్చి తీరికలేని చర్చలు పవర్‌పాయింట్‌ ప్రెజంటేషన్లు చేశారు. ఇక ఢిల్లీకి 23 సార్లు పర్యటించి 27 రోజులు గడిపారని లెక్కలు చెప్పారు. చంద్రబాబును మినహాయిస్తే కాంగ్రెసేతర ముఖ్యమంత్రులెవరూ మమతా బెనర్జీ, జయలలిత వంటివారెవరూ ఇన్ని సార్లు చక్కర్లుకొట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. 1996 నాటికి ఢిల్లీలో ‘కింగ్‌మేకర్‌’గా వున్న చంద్రబాబు స్థానం ఇప్పుడు బలహీనపడినందునే ప్రత్యేక హోదాతో సహా ఏదీ తెచ్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలనుంచి బయిటపడేందుకు ఇదంతా చేస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్నా స్వరాష్ట్రంలో చేయవలసింది వెనక్కుపోయి పర్యటనలతో సమయం హరించుకుపోతున్నదని ఆయన పార్టీవారు కూడా అసంతృప్తిగా వున్నారని ప్రభుచావ్లా రాశారు. ఇన్నిపర్యటనల తర్వాత కూడా తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి చూస్తే చావ్లా వంటివారి వ్యాఖ్యలు వాస్తవమేననిపిస్తాయి. అదే మాట తెలుగువాళ్లు అంటే ఎంతగానో ఆగ్రహించి తనెంత కష్టపడుతున్నదీ ఏకరువు పెట్టే చంద్రబాబు ఈ సీనియర్‌ సంపాదకుడి మాటైనా ఆలకిస్తారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close