రాహుల్ గాంధీ తిరిగి వచ్చేసారు..పట్టభిషేకం ఎప్పుడో?

యూరప్ దేశాలలో నూతన సంవత్సర వేడుకలని జరుపుకొనేందుకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఆదివారం డిల్లీ తిరిగి వచ్చేసారు. రాగానే పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యి ఈ పది రోజులలో దేశంలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి అడిగి తెలుసుకొన్నారు. రాహుల్ గాంధీ తిరిగి రాగానే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించవచ్చని ఇదివరకు వార్తలు వచ్చేయి. ఆయన తిరిగి వచ్చేసారు కనుక త్వరలోనే ఆ సమావేశం నిర్వహించి రాహుల్ గాంధికి పార్టీ పగ్గాలను అప్పగించేందుకు సన్నాహాలు మొదలుపెడతారేమో?

ఇంతవరకు ఒకదాని తరువాత మరొక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నందున వాటిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే దాని వలన ఆయనకు అప్రదిష్ట కలుగుతుందనే భయంతో రాహుల్ గాంధికి పార్టీ పగ్గాలు అప్పగించడానికి సోనియా గాంధీ తటపటాయించేరు. కానీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-జెడి.యు-ఆర్.జె.డి. మహాకూటమి విజయం సాధించిన తరువాత రాహుల్ గాంధికి కూడా పార్టీ పగ్గాలు చెప్పట్టేందుకు దైర్యం వచ్చినట్లుంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీని పక్కకు తప్పించి, పిడిపితో కలిసి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగినట్లయితే, కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగవచ్చును. అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా రాహుల్ గాంధికి పార్టీ పగ్గాలు అప్పజెప్పవచ్చును. కానీ ఈ ఏడాదిలో తమిళనాడు, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించవలసిన భాద్యత రాహుల్ గాంధి తీసుకోవలసి ఉంటుంది. అందుకు వెనకాడినట్లయితే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధిని మళ్ళీ మరో ఏడాదిపాటు ‘వెయిటింగ్’ లో పెడతారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close