ఏదీ ఆనాటి ప్రాధాన్యం..? మోడీతో రామోజీకి చెడిందా..?

ప్రధానిగా నరేంద్రమోడీ రెండో సారి ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీకి ప్రత్యర్థులైన వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక మిత్రుల సంగతి చెప్పాల్సిన పని లేదు. రాజకీయ మిత్రులు మాత్రమే కాదు.. పారిశ్రామిక, సేవా, మీడియా రంగాల నుంచి మోడీకి ఆప్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మోడీ ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానాలు పంపారు. అతిథి మర్యాదలు చూసుకున్నారు. 2014లో వచ్చిన వారందరూ ఉన్నారు… అతి కొద్ది మంది తప్ప.. ఆ అతికొద్ది మందిలో ఒకరు.. తెలుగు మీడియా మొఘల్‌గా ప్రసిద్ధి పొందిన రామోజీరావు.

మోడీ ప్రమాణస్వీకానికి రామోజీకి ఏదీ ఆహ్వానం..?

2014లో నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసే సమయంలో… రామోజీ రావుకు వీవీఐపీ ఆహ్వానం అందింది. ఆయనకు ఢిల్లీలో అద్భుతమైన అతిథి మర్యాదలు అందాయి. ప్రమాణస్వీకార వేడుకల్లో ..దేశాధినేతల్లా.. ఆయనకు మొదటి వరుసలోనే కూర్చునే అవకాశం కూడా లభించింది. ఎందుకంటే.. మోడీతో.. అంతకు ముందు రామోజీరావుకు అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన మీడియాలో బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం.. మోడీకి.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ నేతగా ప్రొజెక్ట్ చేస్తూ… కావాల్సినంత ప్రచారం ఇవ్వడం కారణం. అంతే కాదు.. మోడీతో.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి రామోజీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈటీవీ గుజరాత్ చానల్… హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి బ్రాడ్ కాస్ట్ అవుతుంది. ఈ చానల్ అప్పట్లో గుజరాతీలో నెంబర్ వన్. అప్పడు కూడా..మోడీకి సపోర్ట్‌గా ఉండేది. మోడీ సీఎంగా ఉన్నప్పుడు.. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే.. కచ్చితంగా ఫిల్మ్ సిటీని సందర్శించేవారు. రామోజీతో సమావేశమయ్యేవారు. అక్కడ పని చేస్తున్న గుజరాత్ జర్నలిస్టులతో కాసేపు గడిపేవారు కూడా. అంతగా రామోజీతో అనుబంధం ఉన్న మోడీ… రెండో సారి ప్రమాణస్వీకారానికి.. రామోజీకి ఆహ్వానం పంపలేదు.

పద్మభూషణ్‌ ఇప్పించి మరీ విస్మరించడం ఎందుకు..?

మీడియా రంగంలో… రామోజీ చేసిన కృషిని మెప్పించి పద‌్మభూషణ్ కూడా ఇప్పించారు మోడీ. అలాంటిది రెండో సారి ప్రమాణస్వీకారానికి… ఆహ్వానం పంపకపోవడం… ఆశ్చర్యకరమే. అయితే.. దీనికి రామోజీ.. తన విధానాన్ని మార్చుకోవడమే కారణంగా చెబుతున్నారు. మొదట్లో.. బీజేపీని హార్డ్ కోర్‌గా సపోర్టా చేసిన ఈనాడు.. తర్వాత…అనూహ్యంగా విధానం మార్చుకుంది. మోడీకి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది. ఏపీలో మోడీపై తీవ్ర వ్యతిరేకత పెరగడానికి ఈనాడు ప్రచారం కూడా కారణమని.. ఇక్కడి బీజేపీ నేతలు…నివేదికలు పంపారు. ఓ సారి అమిత్ షా .. సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ వచ్చినప్పుడు..నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లి కలిసి.. మద్దతు కోరారు. అయినా ఈనాడు విధానంలో మార్పు రాలేదు. దాంతో… మోడీ.. రామోజీని.. మద్దతు దారులు, స్నేహితుల జాబితా నుంచి తొలగించాలని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల్లో ఈనాడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిందనే కోపమా..?

నిజానికి తెలుగుదేశం పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయాల వెనుక కచ్చితంగా రామోజీరావు హస్తం ఉంటుందన్న ప్రచారం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వెనుక రామోజీ సలహా ఉండే ఉంటుందని కూడా చెప్పుకున్నారు. బద్దశుత్రవైన… కాంగ్రెస్‌తో… టీడీపీ కలవకుండా ఆపడం చేయాల్సింది పోయి… కలిసి.. కాంగ్రెస్ ను బలోపేతం చేసే ప్రయత్నం చేయడం మోడీకి నచ్చలేదంటున్నారు. బహుశా.. అందుకే… మోడీ.. రామోజీరావును.. తన మిత్రుల జాబితా నుంచి తొలగించి ఉంటారని చెబుతున్నారు. బహుశా అందుకే ఆహ్వానం అందలేంటున్నారు. ఏదేమైనా మొత్తానికి … మోడీకి ఇప్పుడు రామోజీరావు ఆప్తుడు కాదన్న మాట మాత్రం నిజం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close