చట్టం పాస్ : ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు..!

ఆర్టీసీ ఉద్యోగులు.. జనవరి ఒకటో తేదీ నుంచి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. అంటే.. ఫిబ్రవరి ఒకటో తేదీకి వారికి ఏపీ సర్కార్ ఖాతా నుంచి జీతాలు అందుతాయి. ప్రస్తుతం వారికి ఆర్టీసీ కార్పొరేషన్ నుంచి అందుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే సౌకర్యాలన్నీ.. వారికి లభిస్తాయి. ఉద్యోగులు చాలా కాలంగా చేస్తున్న ఈ డిమాండ్ కు ఉన్న అడ్డంకులన్నింటిని జగన్మోహన్ రెడ్డి సర్కార్… చట్టం ద్వారా అధిగమిచింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్.. అసెంబ్లీలో సభ్యుల అభినందల మధ్య ప్రకటించారు.

అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. ప్రైవేట్‌ రంగ సంస్థల్లోని ఉద్యోగులు… ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు తెచ్చిన చట్టం వల్ల విలీనం ఆలస్యం అయిందని.. కొత్త చట్టం తేవాల్సి వచ్చిందన్నారు. జనవరి 1 లోపు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ పూర్తి అవుతుందని రవాణా మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇలా చేయడం వల్ల.. ప్రభుత్వంపై ఏటా రూ. మూడు వేల కోట్ల భారం పడుతుందన్నారు. అయినప్పటికీ.. కార్మికుల ఉద్యోగభద్రత కోసమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామన్నారు.

ఇకపై ప్రజారవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారు. ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సర్కార్.. అలాంటి అవకాశమే లేదని తేల్చి చెప్పేసింది. అయితే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసి చూపిస్తున్నారు. జనవరి ఒకటికి విలీనం పూర్తి చేసి.. ఫిబ్రవరికి… ప్రభుత్వ ఖాతా నుంచి వారికి జీతాలు చెల్లించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close