చివ‌రి ముఫ్ఫై నిమిషాలూ స‌మంత‌వే!

మామా కోడ‌ళ్లు నాగార్జున స‌మంత న‌టించిన ‘రాజు గారి గ‌ది 2’ శుక్ర‌వారం విడుద‌ల అవ్వ‌బోతోంది. స‌మంత అక్కినేని స‌మంత‌గా మారిన త‌ర‌వాత వ‌స్తున్న తొలి సినిమా కాబ‌ట్టి.. అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం మ‌రింత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు తెర‌పై టైటిళ్లు వేస్తున్న‌ప్పుడు ‘స‌మంత‌’ అనే ప‌డేది. ఇప్పుడు ‘అక్కినేని స‌మంత‌’ అనే పేరు చూడొచ్చు.

రాజుగారి గ‌ది 2 చిత్రాన్ని మ‌రి కొద్ది గంట‌ల్లో తెర‌పై చూస్తామ‌న‌గా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో స‌మంత లాయ‌ర్ అమృత‌గా క‌నిపించ‌బోతోంద‌ట‌. అమృత అనే అమ్మాయి క‌థ ఇది. అల్ల‌రి, అమాయ‌క‌త్వం క‌ల‌గ‌లిసిన అమృత – ఆత్మ‌గా ఎలా మారింద‌నే విష‌యం ఆస‌క్తిని రేకెత్తించ‌నుంది. స‌మంత ఈసినిమాలో గెస్ట్ రోల్ అన్న‌ది అంద‌రి అనుమానం. కానీ అదేం కాదు. ఈ సినిమా ఓపెనింగ్ సీన్లోనే సమంత క‌నిపిస్తుంద‌ట‌. చివ‌రి ముఫ్ఫై నిమిషాలూ స‌మంత పాత్రే కీల‌క‌మ‌ట‌. స‌మంత‌పై తెర‌కెక్కించిన ఎమోష‌న‌ల్ సీన్స్ ఈ సినిమాకి ప్రాణం పోయ‌నున్నాయ‌ని చిత్ర‌బృందం తెలిపింది. మ‌రోవైపు సీర‌త్ క‌పూర్ పాత్ర విష‌యంలోనూ క‌న్‌ఫ్యూజ్ ఉంది. ఈ అమ్మాయీ దెయ్యంగానే క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌. చూడ్డాలి రెండు ఆత్మ‌ల మ‌ధ్య నాగార్జున ఏం చేస్తాడో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.