రియల్ జీవోలు సీక్రెట్ – ఫేక్ జీవోలు వైరల్ !

ఏపీలో వైసీపీ పాలనలో ఎన్ని వింతలు చోటు చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఫేక్ జీవోలు ఒకటి. అసలు ప్రభుత్వ జీవోలను ప్రభుత్వమే దాచి పెట్టుకుంటూ ఉంటుంది. అసలు ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు తెలియకుండా ఉంచి సీక్రెట్ గా అమలు చేయడం ఏమిటనేది చాలా మందికి వచ్చే సందేహం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే అయినా ప్రజలకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదనేది ప్రభుత్వ లాజిక్. ఆ ప్రకారం జీవోలన్నీ సీక్రెట్ గా ఉంచుకుంటూ ఉంటుంది.

కానీ ఫేక్ జీవోలు మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా ఎన్ని జీవోలు వైరల్ అయ్యాయో లెక్క లేదు. తాజాగా ప్రభుత్వం పదవీ విరమణ వయసును అరవై రెండు నుంచి అరవై మూడుకు పెంచబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని అధికారవర్గాలు మీడియాకు చెప్పాయి. ఇదే విషయాన్ని మీడియా చెప్పింది. కానీ కొంత మంది ఇదే అదనకు.. అరవై ఐదేళ్లకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ జీవో ఇచ్చినట్లుగా ఫేక్ జీవోను వైరల్ చేశారు. ఇది నిజమేనని నమ్ముకుని కొన్ని మీడియా సంస్థలు ప్రకటనలు చేశాయి.కానీ ఇదే సందనుకున్నట్లుగా ఫేక్ జీవో అంటూ అధికారులు కేసులు పెట్టారు.

అసలు జీవోలను సీక్రెట్ గా ఉంచడం ఎందుకు… సర్క్యూలేట్ అయ్యేవాటిని ఫేక్ గా కేసులు పెట్టడం ఎందుకు అనేదానిపై ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. జీవోఐఆర్ వెబ్ సైట్ ను పూర్తిగా నిలిపివేశారు. పారదర్శకత అనేది లేకుండా పోయింది. ప్రభుత్వం ఎప్పుడు.. .. ఏ ఆస్తులను తాకట్టు పెడుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి వాటికి ఇచ్చే జీవోలను పరువు తీస్తాయని ప్రభుత్వం అనుకుని జీవోలను సీక్రెట్ గా ఉంచుతోంది. నిజంగా అవి పరువు తీసేవే అయితే అసలు ప్రభుత్వం చేయడం ఎందుకు అనే లాజిక్ మనకు వస్తుంది కానీ.. పాలకులకు రాదు. ఎందుకంటే.. వస్తే అసలు చేయరుగా !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close