స్మృతి ఇరానీని అడ్డం పెట్టుకుని బీజేపీ ఏడుపుగొట్టు రాజకీయాలు !

కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి బలం లేదు. అయినా మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. దీనికి మూడు రోజుల పాటు చర్చకు స్పీకర్ నిర్ణయించారు. కానీ అసలు ఈ విషయంలో సంబంధం లేని విషయాలను తీసుకు వచ్చి బీజేపీ చర్చను అర్థం పర్థం లేకుండా చేసేసింది. తొలి రోజు రాహుల్ మాట్లాడలేదని.. బీజేపీ ఎంపీలు సెటైర్లు వేశారు. రెండో రోజు రాహుల్ మాట్లాడితే ప్రతీ సందర్భంలోనూ అడ్డుకున్నారు. చివరికి ఆయన ప్రసంగాన్ని మధ్యలో ముగించి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత మాట్లాడిన స్మృతి ఇరానీ.. మొదట్లో కొంచెం సేపు ఇతర అంశాలపై తనదైన స్టైల్లో ప్రసంగించారు.

ఇలా ప్రసంగం ఇస్తున్న సమయంలోనే వెనుక నుంచి ఓ ఎంపీ పంపించిన స్లిప్ ఐడియాతో సీన్ మరిపోయింది. ప్రసంగిస్తూండగానే తనపై రాహుల్ గాంధీ అసభ్యంగా స్పందించారని.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపించారు. నిజమా ఇదెప్పుడు జరిగింది అని పార్లమెంట్ చూసేవారు.. పార్లమెంట్ లోని వారు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఆశ్చర్యాలతో బీజేపీకి పనేముండదు.. .వెంటనే స్పీకర్ దగ్గరకు వెళ్లి రాహుల్ పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కూడా అర్థం పర్థం లేని ఆరోపమలు చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. నిజానికి రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఎప్పుడు ఇచ్చారా అని వీడియోఫుటేజీ రీప్లే చేసుకుని చూసినా ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లుగా కనిపించలేదు.

మాట్లాడుతున్నప్పుడు అడ్డుకుంటూండటంతో స్పీకర్‌తో ఆయన నోరు చూపించి …తాను మాట్లాడుతానని సైగ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీన్నే ఫ్లయింగ్ కిస్ అని బీజేపీ అన్వయించుకుని బీజేపీ రచ్చ చేసింది. అత్ంత చీప్ ఆలోచనలతో బీజేపీ పార్లమెంట్ సమావేశాలను కూడా భ్రష్టుపట్టిస్తోందని.. ఇలాంటి రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ కు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్మృతి ఇరానీ ఓ మహిళ అయి ఉండి రాహుల్‌పై ఎలా ఇలాంటి ఆరోపణలు చేస్తారన్న ప్రశ్నలూ వస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం రాహుల్ పై ఇలాంటి ఆరోపణలు చేయడానికి ప్రయత్నించడం మాత్రం ఆపడంలేదు.. అది పార్లమెంట్ అయినా సరే !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close