నాగ్ – నాని మ‌ల్టీస్టార‌ర్ ఎవ‌రి చేతికి..??

టాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మ‌ల్టీస్టార‌ర్ రూపుదిద్దుకోబోతోంది. నాగార్జున‌, నాని క‌ల‌సి ఓ సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే నిర్మాత ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు తెలిసిపోయింది. ఈ సినిమా వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ఉండొచ్చ‌ని టాక్‌. అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయి. నాగార్జునకీ అశ్వ‌నీదత్‌కీ మంచి సంబంధాలున్నాయి. ‘గోవిందా గోవిందా’, ‘రావోయి చంద‌మామ’, ‘ఆజాద్’ లాంటి చిత్రాలు ఈ బ్యాన‌ర్ లో తీసిన‌వే. అశ్వ‌నీద‌త్ కుమార్తె స్వ‌ప్న ద‌త్ ఈ ప్రాజెక్ట్‌ని ఫైన‌ల్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించింద‌ని స‌మాచారం. రాజుగారి గ‌ది 2 త‌ర‌వాత నాగ్ ఏ సినిమానీ ఇంత వ‌ర‌కూ ఒప్పుకోలేదు. బహుశా… ఆయ‌న ఫోక‌స్ అంతా.. ఈ మ‌ల్టీస్టార‌ర్‌పైనే ఉండొచ్చు. “ఈ క‌థ చాలా బాగా వ‌చ్చింది. మా రెండు పాత్ర‌లూ అద్భుతంగా కుదిరాయి“ అని ఇది వ‌ర‌కే నాగ్ చెప్పేశారు. ఈ త‌రం హీరోల్లో నాని అంటే ఆయ‌న‌కు బాగా ఇష్టం కూడా. అందుకే… నానితో క‌ల‌సి న‌టించ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడు నాగ్‌. ఈ యేడాది చివ‌ర్లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.