చిరు – ప‌వన్ సినిమా… సుబ్బిరామిరెడ్డి వ‌ద‌ల‌డా?

అప్పుడెప్పుడో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను క‌లిపి ఓ సినిమా చేస్తాన‌ని వేదిక ముందు ప్ర‌క‌టించేశాడు సుబ్బిరామిరెడ్డి. ఈ ప్రాజెక్టు తీసుకెళ్లి త్రివిక్ర‌మ్ చేతిలో పెట్టాడు. అందుకు సంబంధించి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లూ విడుద‌ల చేశాడు. దాంతో మెగా ఫ్యాన్స్ సంబ‌ర ప‌డ్డారు. ఆ త‌ర‌వాత అస‌లు ఈ కాంబినేష‌న్ గురించి ఊసే లేదు. అటు చిరు, ఇటు ప‌వ‌న్‌లు లైట్ తీసుకోవ‌డంతో చిరు – ప‌వ‌న్‌ల సినిమా కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయ్యింది. అస‌లు ఈ కాంబినేష‌న్ సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశ‌మే లేద‌ని, కేవలం ప‌బ్లిసిటీ కోసం చిరు, ప‌వ‌న్‌ల పేర్లు వాడుకొంటున్నాడ‌ని జ‌నం కూడా ప‌సిగ‌ట్టేశారు. దాంతో.. ఈ కాంబో ఓ మెగా జోక్‌లా మారింది.

ఇప్పుడు మ‌ళ్లీ ఈ ప్రాజెక్టు వార్త‌ల్లోకి తీసుకొచ్చాడు సుబ్బిరామిరెడ్డి. ”చిరు,ప‌వ‌న్ ల కోసం క‌థ రెడీ అయిపోతోంది. చిరంజీవి. ప‌వ‌న్‌ల సినిమాలు పూర్త‌య్యాక సెట్స్‌పైకి వెళ్లే సినిమా మాదే..” అంటూ ఇప్పుడు మ‌రోసారి ఆ సినిమాని వార్త‌ల్లోకి ఎక్కించాడు. ప‌వ‌న్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అవి ఎప్పుడు పూర్త‌వుతాయో తెలీదు. చిరు 151వ సినిమా ఇంకా మొద‌ల‌వ్వ‌నే లేదు. ఇవ‌న్నీ పూర్త‌య్యే స‌రికి 2019 ఎన్నిక‌లు కూడా ద‌గ్గ‌ర ప‌డ‌తాయి. అప్పుడు ఎవ‌రి పాలిటిక్స్ తో వాళ్లు బిజీ. సో… సుబ్బిరామి రెడ్డి త‌న సంతృప్తి కోసం అప్పుడ‌ప్పుడూ ఇలా ఈ కాంబో గురించి ఊరించ‌డానికి త‌ప్ప‌.. ప్ర‌క‌ట‌న‌ల‌తో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.