జీవో నెంబర్ 1పై హైకోర్టులోనే తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు !

కోర్టుల విషయంలో తమకు ఏదనిపిస్తే అది చేసే ఏపీ ప్రభుత్వానికి జీవో నెంబర్ 1 విషయంలోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. ఇరవై మూడో తేదీ వరకూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చి 20వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయమని ఆదేశిస్తే…. ఆ కౌంటర్ దాఖలు చేయకుండా నేరుగా సుప్రీంకోర్టుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. కానీ సుప్రీంకోర్టు ఇక్కడ జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని.. హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి అక్కడే తేల్చుకోవాలన్నారు. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 23వ తేదీన ఏపీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. అక్కడ ప్రభుత్వం అనుకున్న విధంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు.

టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్ల పైన సభలు – ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్ విచారణ సమయంలో కీలక వాదనలు జరిగాయి. పిల్ ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ జీవో నెంబర్ 1 ను ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.

ఈ జీవో ఇచ్చిన తర్వాత పూర్తిగా విపక్షాలను అడ్డుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసింది. వేల మంది పోలీసులను ప్రయోగించి.. చంద్రబాబు పర్యటనలను అడ్డుకున్నారు. త్వరలో లోకేష్, పవన్ యాత్రలు చేయబోతున్నారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి కోసం లేఖ పంపినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జీవో నెంబర్ వన్ పై హైకోర్టులో అనుకూల తీర్పు తీసుకు వస్తే ప్రతిపక్ష నేతల్ని రోడ్డు ఎక్కకుండా చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close