సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణలో ట్విస్ట్ !

మే9 వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ జరగనుంది. ఈ కేసులు లిస్ట్ కావడంతో అందరిలోనూ అటెన్షన్ వ్యక్తమయింది. ఇంత త్వరగా ఎలా విచారిస్తారన్న ప్రశ్న ఉదయించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని అందుకే విచారిస్తోందని చెప్పుకున్నారు. అమరావతి కేసుల విచారణకు లిస్ట్ అయిన మాట నిజమే కానీ..అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఈ కేసుకు సంబంధించి చనిపోయిన పిటిషనర్స్ స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలంటూ రైతులు ఎల్‌ఆర్ ఆప్లికేషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మే 9న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

పిటిషనర్లుగా ఉన్న కొందరు రైతులు ఏళ్ల తరబడి చనిపోయారని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చనిపోయిన రైతుల ప్రతినిధులను పిటిషనర్లుగా అనుమతించాలని కోర్టును కోరారు. . ఆ మేరకు రైతుల ప్రతినిధులకు నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వం పంపకపోవడంతో రైతుల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. దీనిపైనే విచారణ చేయనున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో జూలై 11న విచారణ చేస్తామని గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ విచారణ విషయంలో ఎలాంటి మార్పు లేదు. గత విచారణ సమయంలోనే అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు .. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close