‘టాక్సీవాలా’ ఎడ్వాంటేజ్ కోల్పోతోందా?

గీత గోవిందం కంటే ముందే విడుద‌ల కావాల్సిన సినిమా `టాక్సీవాలా`. అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల ఆ సినిమా వాయిదా ప‌డింది. అయితే అదీ మంచికే అయ్యింది. `గీత గోవిందం` త‌ర‌వాత విజ‌య్ న‌టించిన ఏ సినిమా విడుద‌లైనా.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయ్‌. ఆ స్థాయిలో స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు. `టాక్సీవాలా`కి అది బాగా ప్ల‌స్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ఎందుక‌నో.. ముందు నుంచీ `టాక్సీవాలా`కి క్రేజ్ లేదు. విడుద‌ల వాయిదాలు ప‌డుతూ రావ‌డం వ‌ల్ల అది అంత‌కంత‌కూ త‌గ్గుతూ వ‌స్తోంది. `గీత గోవిందం` ఒక్క‌సారిగా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అయిపోవ‌డం `టాక్సీవాలా`కి బాగా క‌లిసొస్తుంది. ఆ సినిమా చూపించి, ఈ సినిమాని మంచి రేట్లకు అమ్ముకోవొచ్చు. సొంతంగా విడుద‌ల చేసుకున్నా.. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయ్‌. అయితే ఆ అడ్వాంటేజీ ఇప్పుడు `టాక్సీవాలా` కోల్పోయే ప్ర‌మాదంలో ప‌డింది. ఎందుకంటే `టాక్సీవాలా` కంటే ముందు `నోటా` విడుద‌ల కానుంది. `నోటా` రెండు భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల అవుతోంది. ఒక్క‌సారి డేట్ ఫిక్స‌యితే మార్చ‌డం క‌ష్టం. `టాక్సీవాలా` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. `నోటా` విడుద‌ల‌య్యాకే… `టాక్సీవాలా` బ‌య‌ట‌కు రాబోతోంద‌ని స‌మాచారం. `నోటా` కూడా హిట్ట‌యిపోతే… `టాక్సీవాలా`రేంజు ఎక్క‌డికో వెళ్లిపోతుంది. అటూ ఇటూ అయితే.. మ‌ళ్లీ య‌ధాస్థితికి వ‌చ్చేస్తుంది. `గీత గోవిందం` అడ్వాంటేజీ అటు టాక్సీవాలాకు ద‌క్కుతుందా? ఇటు నోటా ఎగ‌రేసుకుని పోతుందా? అనేది ఆస‌క్తి క‌లిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close