టిడిపికి రాజధానిలో, రాయచోటిలో ఓటమి, తక్కిన చోట్ల విజయాలు

ఇటీవల జరిగిన మునిసిపల్‌ కార్పొరేటర్ల ఉప ఎన్నికల ఫలితాలలో పాలక తెలుగుదేశం పార్టీకి వూహించిన దెబ్బ అది కూడా తగలకూడని చోట తగిలింది. రాజధాని కేంద్రమైన మంగళగిరి మునిసిపాలిటిలో గతంలో తమ చేతిలో వున్న 31 వ వార్డు టిడిపి చేయిజార్చుకుంది. వైసీపీ అభ్యర్థి మేరుగుమిల్లి వెంకటరమణ 153 ఓట్ల మెజార్టితో గెలుపొందారు. 2014లో ఇక్కడ గెలిచిన టిడిపి కార్పొరేటర్‌ మురళీకృష్ణ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అవసరమైంది. .

మంగళగిరికి వైసీపీ ఎంఎల్‌ఎ బడా వ్యాపారవేత్త ఆళ్ల రామకృష్ణారెడ్డిప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై పిటిషన్‌ వేసి తిరగదోడింది కూడా ఆయనే.తమ ప్రచారానికి కేంద్రంగా వున్న రాజధాని ప్రాంతంలోనే ఓటమి రాజకీయంగా దెబ్బ అని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.ఆంధ్రజ్యోతి ఈ ఓటమికి టీడీపికి వైసీపీ ఇచ్చిన షాక్‌గా అభివర్ణించింది.కడపజిల్లా రాయచోటి ఉప ఎన్నికలో కూడా వైసీపీ గెలిచింది. ఇక తక్కిన అన్ని చోట్ల టిడిపి విజయం సాధించినట్టు సమాచారం.

ముఖ్యంగా ఎన్టీఆర్‌ కుటుంబ వారసత్వం రీత్యా కీలకమైన గుడివాడ మునిసిపాలిటీ 19వ వార్డులో టిడిపి అభ్యర్థి ప్రసాద్‌ 149 ఓట్ల మెజార్టితో వైసీపీని ఓడించారు. ఎమ్మెల్యే కోడాలి నాని వ్యక్తిగతంగా పోరాడినా ఈ స్థానం నిలబెట్టుకోలేకపోవడం వైసీపీకి దెబ్బే. ఈ ఫలితం తర్వాత శరత్‌ టాకీస్‌ సెంటర్‌లో ఇరు పార్టీల మద్యన ఘర్షణ జరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close