పీసీసీ పోస్ట్ ఫైటింగ్..! కాంగ్రెస్ ఇక మారదు..!

పునాదులు కదిలిపోయాయి..! పార్టీ కొన ఊపిరికి వచ్చింది..! అయినప్పటికీ..తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రాలేదు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం నేనంటే నేనని మీడియాకు ఎక్కుతున్నారు. బలంగా ఉన్న పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. డిపాజిట్లు రాని పార్టీగా మార్చేశారు. ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోవర్టని.. కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టిబొమ్మలు దగ్దం చేసుకునేంత వరకూ పరిస్థితి వచ్చింది. గ్రేటర్‌లోనూ పార్టీ పరిస్థితి అయిపోయిందనిపించిన తర్వాత ఆయన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపారు. ఇప్పుడు కూడా.. పార్టీ హైకమాండ్ ఎవర్ని చీఫ్ గా నియమిస్తే.. వారి ఆధ్వర్యంలో పని చేసి పార్టీని కాపాడుకుందామనుకున్న ఆలోచన పార్టీ నేతలు చేయడంలేదు.

పీసీసీ పోస్టు కోసం రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేశారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తాము రేసులో ఉన్నామంటున్నారు. పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి పీసీసీ కోసం రాజకీయం చేస్తోంది. భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నాల, వి.హెచ్ వంటి వారంతా పార్టీలో మొదటి నుండి పనిచేస్తోన్న వారికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని హై కమాండ్ ముందు ప్రతిపాదనలు పెడుతున్నారు. షబ్బీర్ అలీ, మల్లు రవి, బలరాం నాయక్ వంటి నేతలు రేవంత్ పీసీసీ కావాలని బలంగా కోరుకుంటున్నారు. అధిష్టానం సైతం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అందుకే రేవంత్ తప్పా ఎవరైనా ఒకే అన్న వాదనతో సీనియర్లు రచ్చ ప్రారంభించారు.

ఇప్పటికే రేవంత్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ హై కమాండ్ సీనియర్లు మీడియాకు ఎక్కడాన్ని కూడా సీరియస్‌గానే తీసుకుంటోంది. పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం ఎవర్నీ నమ్మే పరిస్థితుల్లో లేరు. అందరూ టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయిన వారేనని… ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం నిఖార్సుగా పని చేస్తున్నారన్న చర్చ మాత్రం జరుగుతోంది. రేవంత్ ను అడ్డుకోవడం కోసం…. పార్టీలో జరుగుతున్నప్రయత్నాలు.. చూసి..ఇక పార్టీ బతికి బట్టకట్టదనే అభిప్రాయాన్ని కూడా కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close