2019 తర్వాత తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు గోల్డెన్ డేస్ !

తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టు పక్కన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం 2019 తర్వాత ఊహించనంత వేగంగా పెరిగింది. దానికి ఔటర్ అవతల 20 కిలోమీటర్ల వరకూ ఏర్పడిన వెంచర్లు మాత్రమే సాక్ష్యం కాదు.. . ప్రభుత్వానికి చేరుతున్న రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా. 2018-19లో తెలంగాణ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.6,612 కోట్లు. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెలన్నర రోజుల వరకూ వచ్చింది రూ.12,624 కోట్లు. ఎలా లేదన్న మార్చి ముగిసే సరికి పదిహేను వేల కోట్లకు చేరుతుంది.

అంతే కాదు.. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అంటే అటూ ఇటూగా ఇరవై వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుంది. ఏపీలో ప్రభుత్వం మారక ముందు .. మారిన తర్వాత నాలుగేళ్లలో తెలంగాణ రియల్ ఎస్టేట్ జాతకం అలా మారిపోయిందన్నమాట. ఈ ఏడాది వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రూపంలో 17.16లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. ధరణి పోర్టల్‌కు 10.54 కోట్ల హిట్లతో ఇప్పటివరకు 30కోట్ల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2014-15లో భూ లావాదేవీలు 8.26లక్షల డాక్యుమెంట్లు మాత్రమే. అత్యధికంగా హైదరాబాద్‌ చుట్టే రియల్‌ వ్యాపారం జోరందుకుంటోంది.

ఎక్కువ క్రయవిక్రయాల జాబితాలో మొదటి స్థానంలో రంగారెడ్డి, ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరీ, హైదరాబాద్‌ ఉన్నాయి. ఓ వైపు పొరుగున ఉన్న ఏపీలో ఆస్తుల విలువ ఏ మాత్రం పెరగకపోగా పడిపోతోంది. మరో వైపు తెలంగాణలో ఇబ్బడిమబ్బడిగా పెరుగుతోంది. లక్షల కోట్లలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఓ వైపు రిజిస్ట్రేషన్ల ఆదాయం మాత్రమే కాదు…. ప్రభుత్వ భూముల విలువ పెరగడంతో పెద్ద ఎత్తున వాటిని అమ్మి ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోంది. ఆర్థిక సమస్యలు తీర్చుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close