తెలుగు పరిశ్రమ 2015 : రచ్చకెక్కిన వివాదాలు

పరిశ్రమలో ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంటుంది. సినిమా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అనే తేడా లేకుండా వివాదాలు భలే జోరందుకుంటాయి. ఈ సంవత్సరం మంచి వివాదాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు తెలుగు పరిశ్రమ వారు. ఇక వాటిలో మాట్లాడుకోవాల్సి వస్తే.

అఖిల్ సినిమా వివాదం : ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన అఖిల్ సినిమా విడుదల వాయిదా వేయడంతో ఆ సినిమా నిర్మాత నితిన్ మీద అక్కినేని అభిమానులు విరుచుకు పడ్డారు. అంతేకాదు సినిమా వాయిదా నిర్ణయం అఖిల్ కు చెప్పకుండానే చేశారని..తండ్రి కొడుకుల మధ్య కొన్ని రోజులు మాటలు లేవని అపట్లో మీడియా తెగ హడావిడి చేసింది.

భారీ మూల్యం చెల్లించుకున్న అలి : కమెడియన్ అలి స్టేజ్ మీద వీర విరాహం చేయడం తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడంతో ఓ ఎన్నారై అలిని కడిగేయడం రచ్చ రచ్చ చేసింది. ముఖ్యంగా సైజ్ జీరో ఆడియోలో అనుష్క తొడల గురించి మాట్లాడిన అలి ఏకి పారేశారు మహిళా సంఘాలు. అలి స్పెషల్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి మరి తను మాట్లాడేదంతా సరదాగా అని చెప్పి వివాదానికి తెర దించాడు.

రాధికా ఆప్టే సంచలనం : టాలీవుడ్ లో హీరోయిన్స్ ని చాలా చీప్ గా చూస్తున్నారంటూ లెజెండ్ బ్యూటీ రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. లెజెండ్ తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆమె తిరస్కరించిందని టాక్.

సిద్ధార్థ్ – సమంతల బ్రేక్ అప్ : లవర్ బోయ్ సిద్ధార్థ్, స్టార్ హీరోయిన్ సమంతల మధ్య చిగురించిన ప్రేమ మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. జబర్దస్థ్ సినిమాతో కలిసిన వీరి మనసులు త్వరగానే విడిపోయాయి. మొన్నామధ్య ట్విట్టర్లో సిద్దూ పెట్టిన కామెంట్ కు సమంత అదే రేంజ్ లో రిప్లై ఇచ్చింది.

శ్రీను వైట్ల – కోనా వెంకట్ గొడవలు : డైరక్టర్ శ్రీను వైట్ల, కోనా వెంకట్ ల గొడవ ఈ ఇయర్ మంచి ఎంటర్టైన్ అని చెప్పాలి. బ్రూస్ లీ ఫ్లాప్ అవ్వడానికి కారణం శ్రీనువైట్లనే అంటూ మైకు దొరికితే అతని మీద వీరంగం ఆడాడు కోనా. ఈ టెన్షన్ లో భార్య నుండి కూడా ఊహించని షాక్ తిన్నాడు శ్రీను వైట్ల.

త్రిష ఎంగేజ్ మెంట్ కహాని : హాట్ బ్యూటీ త్రిష కెరియర్ కు ముగించుకుని పెళ్లికి సిద్దమైంది. బిజినెస్ మ్యాన్ వరుణ్ మణీయన్ తో నిశ్చితార్ధం కూడా చేసుకున్న త్రిష్ చివరకు అది క్యాన్సిల్ చేసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది.

పూరి – ఛార్మిల మధ్య లవ్ : దర్శకుడు పూరికి ఛార్మింగ్ హీరోయిన్ ఛార్మికి మధ్య సంథింగ్ సంథింగ్ అని గుస గుసలు వచ్చాయి. ఈ వ్యవహారం పూరి దాకా వెళ్లడంతో పూరి కేవ్ లోకి చార్మికి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశాడు పూరి జగన్నాథ్.

వర్మని చంపేసిన మెగా ఫ్యాన్స్ : సంచలన దర్శకుడు వర్మ ఈ సంవత్సరం సేన్షేషనల్ కామెంట్స్ చేసాడు. తన పూర్తీ ఏకాగ్రత మొత్తం మెగా ఫ్యామిలీ మీద పెట్టిన వర్మ పవర్ స్టార్ ట్విట్టర్ ఫాలోయింగ్ మీద సంచలన కామెంట్స్ చేసి పవన్ ఫ్యాన్స్ కి బలయ్యాడు. ఏకంగా వర్మ హఠాన్మరణం అంటూ పవన్ ఫ్యాన్స్ దుమారం లేపడం జరిగింది.

మొత్తానికి ఈ సంవత్సరం మొత్తం ఎన్నో వివాదాలు ప్రేక్షకులను కన్ ఫ్యూజ్ చేస్తూనే భలే ఎంటర్టైన్ చేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close