శివప్రసాద్‌పై హిజ్రాల ఫిర్యాదులు..! మనోభావాలు దెబ్బతీశారు…!

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ .. రోజుకో వేషంతో…పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు సందడి చేశారు. మీడియా అటెన్షన్ పొందారు. ఈ వేషాలు చూసి.. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకు మహా కోపం వచ్చింది. వెంటనే.. ఆయన పార్లమెంట్ భద్రతకు కూడా.. ముప్పు తెచ్చి పెడుతున్నారన్న రీతిలో .. లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనలు వ్యక్తం చేస్తే చర్యలు ఎలా తీసుకుంటారో జీవీఎల్ చెప్పలేదు. ఇప్పుడు శివప్రసాద్ వేసిన వేషాలు.. జీవీఎల్‌కే కాదు… హిజ్రాలకు కూడా కోపం తెప్పించారు. ట్రాన్స్‌జెండర్లు అయిన వారి వేషం… శివప్రసాద్.. వేయడమే దీనికి కారణం.

శివప్రసాద్ వేసిన హిజ్రా వేషమే ఇప్పుడు ఆ ఎంపీ కొంప ముంచింది. ఒక ఎంపీ అయ్యి ఉండి.. హిజ్రాలను అవమానపరిచే విధంగా ఆయన ప్రవర్తించారని..వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. హిజ్రాలను అవమానపరిచే రీతిలో వెకిలి చేష్టలు చేసిన శివప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ కూడా చేస్తున్నారు. వాళ్లే కాదు.. ఇటీవల శ్రీరెడ్డి అనే నటీమణి ఇష్యూలో తెరపైకి వచ్చిన తమన్నా అనే హిజ్రా కూడా విజయవాడలో శివప్రసాద్ పై ఫిర్యాదు చేసింది. తాను ఆపరేషన్ చేయించుకుని అవయవాలు అన్నీ మార్చుకుని.. ఆడవాళ్లలానే బతుకుతున్నామని అయినా శివప్రసాద్ ఆవమానించారనేది ఆమె అభియోగం.

తనపై వస్తున్న ఫిర్యాదుల విషయంలో… శివప్రసాద్ ఇంకా స్పందించలేదు. కానీ ఆయన మాత్రం తనను ఓ కళాకారుడిగా చూడాలని.. ఎవర్నీ కించ పరచడం తన ఉద్దేశం కాదని.. ముందు నుంచీ చెబుతున్నారు. హిజ్రాలకు ఆయన ఏమైనా వివరణ ఇస్తారో. సైలెంట్‌గా ఉంటారో వేచి చూడాలి. కొద్ది రోజుల కిందట… హిజ్రాలు.. పెన్షన్ ప్రకటించారని.. చంద్రబాబుకు నంద్యాలలో గుడి కట్టించారు. ఇప్పుడు వారే టీడీపీ ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close