ఎమ్మెల్సీ ఎన్నికలకి తెరాస అభ్యర్ధుల పేర్లు

తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలకి కాంగ్రెస్, తెదేపా, బీజేపీల కంటే ముందు అధికార తెరాస తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. తెరాస సెక్రటరీ జనరల్ కె.కేశవ్ రావు మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలలో 7 స్థానాలకు తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. వారిలో లక్ష్మినారాయణ- ఖమ్మం, పి. సతీష్-అదిలాబాద్, ఎన్.లక్షణ రావు మరియు భాను ప్రసాద్-కరీంనగర్, ఆర్.భూపతి రెడ్డి-నిజామాబాద్, టి. చిన్నప్ప రెడ్డి-నల్గొండ, భూపాల్ రెడ్డి-మెదక్ నుండి పోటీ చేస్తారు. వరంగల్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ లనుండి పోటీ చేయబోయే మిగిలిన ఐదుగురు అభ్యర్ధుల పేర్లను కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని కేశవ్ రావు తెలిపారు.

మొత్తం 12 స్థానాలలో తెరాస అభ్యర్ధులను గెలిపించుకోగలిగినంత బలం తమ పార్టీకి ఉన్నందునే అభ్యర్ధులను నిలబెడుతున్నాము తప్ప ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆకర్షించి వారి అండ చూసుకొని అభ్యర్ధులను నిలబెట్టడం లేదని తెలిపారు. తమ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయవలసిన దుస్థితిలో తమ పార్టీ లేదని అన్నారు. దానం నాగేందర్ తెరాసలో చేరే విషయం గురించి తనకు తెలియదని కేశవ్ రావు అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

ఓటేస్తున్నారా ? : క్రిమినల్ ఎప్పుడూ హీరో కాదని గుర్తుంచుకోండి !

" ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదేపెద్ద దొంగ వందలు, వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే.. ఎక్కడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close