మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

గురువారం నుంచి మరో రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ , సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

2015,16 వరుస సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నాడు ఎండలకు భరించలేక ఎంతోమంది మరణించారు. మళ్లీ ఇప్పుడు సూర్యుడు ప్రతాపం ప్రదర్శిస్తుండటంతో వాతావరణ శాఖ అధికారులు ముందస్తు అలర్ట్ ఇచ్చారు.

ఏవైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close