మురళి మోహన్ గారూ, ఒకసారి వీరమాచినేని ట్రై చేయొచ్చుగా..

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుంటున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నిరాహారదీక్షలని, రైల్వే జోన్ తదితర డిమాండ్లని వెటకారం చేస్తూ ఎంపీలు మాట్లాడడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అందరిలోకి మురళీమోహన్ వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి.

ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జోన్ లేదు గీన్ లేదు అని నవ్వుతూ అంటే దానికి సమాధానంగా మురళీమోహన్, “ఏమండీ, నాకు ఒక 5 కేజీల బరువు తగ్గాలని ఉంది కాబట్టి నేను ఒక వారం రోజుల పాటు దీక్ష కూర్చుంటాను” అని వెటకారంగా అనడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నా మధ్యనే “వెంకన్న చౌదరి” అంటూ వ్యాఖ్యలు చేసి ఆనక లెంపలేసుకున్న మురళి మోహన్ గారు మళ్ళీ ఇంత వెటకారంగా మాట్లాడడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది మురళీమోహన్ గారికి నిజంగా అంత గా బరువు తగ్గాలనే సరదా ఉంటే దానికి చాలా పద్దతులు ఉన్నాయి . ఈ మధ్యనే వీరమాచినేని అని ఒక బరువు తగ్గే పద్ధతి బాగా ప్రాచుర్యం అవుతోంది. టీవీల్లో కూడా దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. బహుశా ఆయన వాటిని ప్రయత్నించడం మంచిది.

ప్రజల విజ్ఞప్తి ఏంటంటే – ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే మురళి మోహన్ గారు ఇలాంటి పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు అంతేతప్ప స్వామికార్యం, స్వకార్యం అంటూ తాము బరువు తగ్గడం కోసం దీక్షకు కూర్చుని, ప్రజల కోసమే దీక్షలు చేస్తున్నామంటూ బిల్డప్పులు ఇచ్చి ప్రజల్ని మోసం మాత్రం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి మోసపూరితమైన మాటలు, చేష్టలు ఎన్నో విని, చూసి విసిగిపోయి ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా మళ్ళీ ఇలాంటి మోసపూరితమైన, స్వలాభం కోసం చేసే పనులకు దిగవద్దని ఎంపీ గారిని ప్రజలు సవినయంగా కోరుతున్నారు

-జురాన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close