బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా వైసీపీదీ అదే ” షిక్కటి చిరునవ్వు ” !

బీజేపీ నేతలు ఎవరైనా వచ్చి ” మీరు ఎదవలు రా ” అని తిడితే… ఏదో మీ అభిమానం అని… షిక్కటి చిరునవ్వుతో తడుచుకుని వెళ్లిపోవాలన్న రూల్ ను ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టి… మద్యం స్కాం దగ్గర్నుంచి శాంతి భద్రతల అంశం వరకూ అన్నింటిపైనా విమర్శలు చేశారు. అంతిమంగా ఓ పనికి మాలిన ప్రభుత్వం ఉందని తేల్చారు. అయితే.. వైసీపీ నేతలు మాత్రం… స్పందించడానికి తటపటాయించారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం తీసుకుంటే తీసుుకోవచ్చని… అంబటి రాంబాబు గౌరవంగా సమాధానం ఇచ్చారు. ప్రత్యేకహోదా ఇస్తే క్రెడిట్ తీసుకోవచ్చని.. విజయసాయిరెడ్డి నంగి నంగిగా ఓ ట్వీట్ పెట్టారు తప్ప.. ఇంకెవరూ స్పందించలేదు.

బీజేపీ తో ఇప్పటికిప్పుడు వైరం పెట్టుకోకూడదని వైసీపీ అనుకుంటోంది. జాతీయ నేతలు వచ్చి తిట్టినా .. రాష్ట్ర నేతలు విమర్శలు చేసినా మౌనంగా ఉంటున్నారు. సైలెంట్ గా ఉన్నామని వారు చేసిన ఆరోపణలన్నీ నిజమని అంగీకరించినట్లు అవుతుందన్న ఆందోళన వైసీపీ నేతల్లో ఉన్నా ఎవరూ నోరు మెదపడం లేదు. కేంద్రంతో గొడవలు పెట్టుకునే పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ లేదు. ఎన్నో అంశాలపై కేంద్రంతో రాజీపడ్డ వైసీపీ సర్కార్ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది. తేడా వస్తే ఏమవుతుందో ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉదంతమే చూపిస్తోంది.

ఇప్పటికే టీడీపీ ఎన్డీయేకు దగ్గరవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్న వేళ ఏదన్నా పొరపాటున బీజేపీ నేతలపై ఎదురు తిరిగితే జగన్ భవిష్యత్ కు గ్యారంటీ ఉండని పరిస్థితి. అందుకే ఏపీ బీజేపీ విషయంలో వైఎస్సార్సీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అందుకే జనసేన, టీడీపీ టార్గెట్ గా వైసీపీ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తుంటారు. ఈ సమయంలో ఏదైనా బీజేపీని మాట అంటే ఢిల్లీ నుంచి వచ్చిపడే తిట్లు తట్టుకోలేక వైసీపీ భరిస్తోందని అందరి అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close