వారిని పార్టీలో చేర్చుకోవడంపై జగన్ దృష్టి!

రాజకీయ వలసలు అనివార్యం అని గుర్తించినట్టుగా ఉన్నాడు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు అనేక మంది కాంగ్రెస్ మాజీ, తెలుగుదేశం అసంతృప్తులు వచ్చి చేరతామని కోరినా.. కొందరి విషయంలో జగన్ ఆసక్తి చూపలేదు. అవసరం అవుతారు అనుకున్న వారిని చేర్చుకుని మిగతా వారికి పలకలేదు జగన్ మోహన్ రెడ్డి. మరి అదంతా నాటి లెక్క. ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు అనేక మంది నేతలు తన పార్టీని వీడిపోవడం వంటి కారణాలతో జగన్ తన పంథాను మార్చాడు. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ మాజీలను చేర్చుకొంటూ ముందుకు పోతున్నాడు!
ఉండవల్లి వంటి వాళ్లు జగన్ పార్టీలోకి చేరడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన మాత్రమే గాక.. ఇంకా అనేక మంది కాంగ్రెస్ మాజీలు త్వరలోనే జగన్ పార్టీ బాట పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వీరిని మాత్రమే కాదు.. జగన్ తెలుగుదేశం వైపు కూడా చూస్తున్నట్టు సమాచారం. ప్రత్యేకించి మొన్నటి ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి చేరి, ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలై ఇప్పుడు తెలుగుదేశంలో అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించే పనిలో ఉందట జగన్ గ్యాంగ్.

ఎన్నికల ముందే తెలుగుదేశం చేరారు కాబట్టి.. వారికి టీడీపీతో అంతగా అనుబంధం ఉండదు. పార్టీ గెలిచినా, ఓడిపోయిన వారికి తెలుగుదేశంలో ఎలాంటి ప్రాధాన్యతా దక్కడం లేదు. దశాబ్దాలుగా తెలుగుదేశంలో ఉన్న వారు.. వీరిని అణగదొక్కుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్నారనే పేరే కానీ వీరి మాట జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని తనవైపుకు తిప్పుకోవడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఇలాంటి నేతల మీద జగన్ దృష్టి పెట్టినట్టు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close