రేవంత్ రెడ్డికి అన్యాయం జరిగిపోయింది: అంబటి

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని మేనేజ్ చేసి ఆ కేసులో నుంచి ఎలాగో బయటపడ్డారని కానీ రేవంత్ రెడ్డిని మాత్రం గాలికి వదిలేసారని వైకాపా నేత అంబటి రాంబాబు అరోపించారు. అయితే ఆయన చేసిన ఈ ఆరోపణలో ఏమాత్రం పసలేదని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు బయటపడి ఉండి ఉంటే, రేవంత్ రెడ్డి కూడా బయటపడినట్లే భావించవచ్చును. ఒకవేళ అంబటి రాంబాబు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని ఈ కేసులో పట్టించుకోకపోయుంటే, అప్పుడు రేవంత్ రెడ్డి తప్పకుండా చంద్రబాబు నాయుడుని కూడా ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేసి ఉండేవారని ఖచ్చితంగా చెప్పవచ్చును.

ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్య ప్రధాని నరేంద్ర మోడి రాజీ చేసారని ఆయన ఆరోపించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి అవినీతి కేసుల్లో మధ్యవర్తిత్వం చేసారని చెప్పడం చాలా అవివేకమే. కేసీఆర్ ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడుని ట్రాప్ చేద్దామని ప్రయత్నించినపుడు, అదృష్టవశాత్తు ఆ ఊభిలో నుంచి బయటపడేందుకు సరయిన సమయంలో టెలీఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేతికి అందిరావడంతో చంద్రబాబు నాయుడు సేఫ్ గా బయటపడగలిగారని చెప్పవచ్చును. ఆయనతోబాటే రేవంత్ రెడ్డి కూడా బయటపడ్డారు. ఆ తరువాత తెలంగాణా తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్) గా ప్రమోషన్ కూడా పొందారు.

ఆయనని గాలికి వదిలేసారని అంబటి రాంబాబు మాటలలో అర్ధం లేదు కానీ పరమార్ధం ఉంది. చంద్రబాబు నాయుడు మూలంగానే రేవంత్ రెడ్డి ఇన్ని కష్టాలు పడవలసి వచ్చిందని, అయినా ఆయనని చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని, పార్టీలో ఆయనకి అన్యాయం జరిగిపోతోందని రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఎగద్రోయడానికే అంబటి రాంబాబు ఆవిధంగా అని ఉండవచ్చును. కానీ అంబటి రాంబాబు రెచ్చగొడితే రెచ్చిపోయేంత తెలివి తక్కువ వారు కాదు రేవంత్ రెడ్డి. అయినా ఓ రాయి విసిరి చూస్తే పోయేదేముంది అని విసిరినట్లున్నారు అంబటి రాంబాబు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close