వైసీపీ తరపున రాజ్యసభకు ఈ నలుగురే..!?

రాజ్యసభ సీట్లకు ఎన్నికలు వచ్చేశాయి. ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు.. వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. అదీ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం ఖాయం. టీడీపీ కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. దాంతో.. నాలుగు రాజ్యసభ సీట్ల కోసం.. వైసీపీలో రేస్ ప్రారంభమయింది. అయితే.. జగన్మోహన్ రెడ్డి.. ఈ రాజ్యసభ సీట్లను ఎవరెవరికి ఇవ్వాలో ఇప్పటికే ఖరారు చేసుకున్నారని అంటున్నారు. పార్టీ విధేయత… సామాజిక సమీకరణాలు చూసుకుని నలుగురి పేర్లను టిక్ పెట్టుకున్నారని… చివరి క్షణంలో.. ఆయన ఆలోచనల్లో మార్పులు వస్తే తప్ప.. లేకపోతే.. ఆ పేర్లే ఉంటాయంటున్నారు.

రాజ్యసభకు ఖరారైనట్లుగా వైసీపీలో జరుగుతున్నప్రచారంలో మొదటి పేరు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి . రాంకీ గ్రూప్ అధినేత అయిన ఈయన.. వైసీపీలో తెరవెనుక చాలా కాలంగా పని చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడు కూడా. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూంటారు. ఈయన 2014 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ కోసం మాత్రం పని చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయనకు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాలని జగన్ ఎప్పుడో నిర్ణయించారు. ఆ ప్రకారం ఇప్పుడు ఆయన పేరు ఖరారయినట్లుగా తెలుస్తోంది. మరో స్థానానికి జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పేరును కూడా దాదాపుగా ఖరారు చేశారు. ఎంపీ టిక్కెట్‌ను త్యాగం చేసినందున రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ గతంలోనే హామీ ఇచ్చారు.

రెండు సీట్లు ఖచ్చితంగా రెడ్డి సామాజికవర్గానికి ఇస్తున్నందున.. ఇతర వర్గాలకు.. మిగతా రెండు సీట్లు కేటాయించాల్సి ఉంది. ఇందులో ఒకటి.. బీసీ వర్గాలకు ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆఫర్ చేసి.. నెల్లూరు జిల్లా టీడీపీ నేత.. బీద మస్తాన్ రావును.. పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు ఖాయమని అంటున్నారు. ఇప్పుడు వైసీపీకి ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందినవారే. మరో సీటు కోసం… పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మధ్య పోటీ ఉంది. వీరిద్దరూ ఎమ్మెల్సీలు. మండలి రద్దు అవుతుందని భావిస్తున్న జగన్.. వీరితో పదవులకు రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నారు. ఒకరికి పార్టీ పదవి.. మరొకరికి రాజ్యసభ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. మోపిదేవి పేరు రేసులో ముందుంది. ఇప్పటికైతే.. ఇవే పేర్లని.. జగన్ ఆలోచనలు మారితే.. కొత్త వారి పేర్లు బయటకు రావొచ్చని అంటున్నారు. చిరంజీవికి రాజ్యసభ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా.. అది ఉత్త పుకారేనని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close