పెరుగుతున్న బీజేపీలో ప్రో టీడీపీ నేతల వాయిస్ !

ఏపీ బీజేపీలో మూడు వర్గాలు ఉంటాయి. ఒకటి ప్రో వైసీపీ .. రెండు ప్రో టీడీపీ, మూడోది నిఖార్సైన బీజేపీ. ఈ నిఖార్సైన బీజేపీ నేతలకు హైకమాండ్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వదు. అయితే ప్రో టీడీపీ లేకపోతే.. ప్రో వైసీపీ. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది.. వైసీపీ కాబట్టి ఆ పార్టీ సానుభూతిపరులకు అందలం ఎక్కించారు. ఢిల్లీలో వైసీపీ సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి.. ఏపీ వైపు చూడటం లేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రో టీడీపీ నేతల వాయిస్ కూడా పెరుగుతోంది.

పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. అధికారికంగా జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. కానీ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఎప్పుడూ వారు కలిసింది లేదు. అదే సమయంలో జనసేన టీడీపీకి దగ్గరవుతోంది. బీజేపీ ఎటూ కాకుండా పోతోంది. ఒంటరిగా పోటీ చేస్తే.. నామినేషన్ వేసే డిపాజిట్లు కూడా ఖర్చు దండగని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఆ విషయం గత ఎన్నికల్లో రుజువు అయింది. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా ఏమీ ప్రయోజనం ఉండదని తేలిపోయింది. దీంతో బీజేపీలోని ఓ వర్గం.. టీడీపీతో పొత్తు కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

టీడీపీ తరపున ఎన్నికయ్యి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్ .. ఇదే చెబుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరని.. టీడీపీ కూడా దీనికి మినహాయింపు కాదంటున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందనే దిశలోనే ఆయన చెబుతున్నారు. ఆయన బహిరంగంగా చెబుతున్నారు. చాలా మంది బీజేపీలోని టీడీపీ సానుభూతిపరులు మాత్రం పొత్తు ఉంటుందంటున్నారు. టీజీ వెంకటేష్ పార్టీ మారారు కానీ.. ఆయన కుమారుడు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. కర్నూలు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి టిక్కెట్ కూడా ఖరారు చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close