తెదేపా-బీజేపీ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక హోదా విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్రంలో తెదేపా-బీజేపీ నేతల మద్య యుద్ధం మొదలయింది. బీజేపీ తరపున సోము వీర్రాజు బాణాలు వేస్తుంటే, తెదేపా తరపున ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ బాణాలు సంధించారు. ఆ తంతు ముగిసిన తరువాత యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలని మిత్రపక్షమయిన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. తెదేపా-బీజేపీల మధ్య పరస్పర అవగాహన కల్పించేందుకు ఇరు పార్టీ నేతలతో కూడిన ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం దేనిదారి దారి దానిదే అన్నట్లుగా సోము వీర్రాజు నేతృత్వంలో తెదేపా నేతలపై, ప్రభుత్వంపై కత్తులు దూస్తూనే ఉన్నారు.

తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ సోము వీర్రాజుని విమర్శించడాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాక వెంకటసత్యనారాయణ ఖండించారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బీజేపి నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి మోడీ ప్రభుత్వం సహకారం అందిస్తునప్పటికీ తెదేపా నేతలు మోడీని, కేంద్రప్రభుత్వం విమర్శించడం సరికాదు. తెదేపా ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న కారణంగానే వారు ఏవిధంగా మాట్లాడుతున్నప్పటికీ మేము సంయమనం పాటించవలసివస్తోంది,” అని అన్నారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు కేంద్రం నుండి భారీగా నిధులు తెచ్చుకొంటూనే, మళ్ళీ కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని తెదేపా నేతలు చెప్పుకోవడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నీరు- చెట్టు పథకంలో ఎంత అవినీతి జరిగిందో మాకు తెలుసు. బీజేపీ నేతలను తప్పు పడుతున్న తెదేపా నేతలు, దైర్యం ఉంటే ఆ పధకంలో అవినీతి గురించి మాట్లాడితే బాగుంటుంది,” అని ఎద్దేవా చేసారు.

సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడి రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. కానీ కొందరు టీడీపీ నాయకులే ఆయన దిష్టి బొమ్మలను దగ్దం చేస్తుంటే తెదేపా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది? దానిని మేము ఏవిధంగా అర్ధం చేసుకోవాలి? మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరానికి ఉన్న అడ్డంకులు తొలగించారు. రాష్ట్రానికిని నిరంత విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టుని మంజూరు చేసారు. తద్వారా రాష్ట్రానికి కొత్తగా అనేక పరిశ్రమలు వస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా రాష్ట్రానికి 16 నెలల వ్యవధిలోనే ఐదు ఉన్నత విద్యాసంస్థలను కేంద్రం మంజూరు చేసింది. అమరావతి మాష్టర్ ప్లాన్ కూడా రాకముందే రాజధాని నిర్మాణం కోసం వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇన్ని చేస్తున్నా ఇంకా ప్రధాని నరేంద్ర మోడి పట్ల తెదేపా నేతలు చాలా అవమానకరంగా మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close