చంద్రబాబుకో గుస్సా క్యూ?

శాసనసభ ప్రత్యేక సమావేశం సందర్భంగా జరిగిన టిడిఎల్‌పి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగంలో నిర్వేదం నిరసన కూడా తొంగిచూస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ప్రవర్తన బాగాలేదని విమర్శించడం మామూలే. వారు మారే అవకాశం లేదని కూడా చెప్పారు. దేన్ని వ్యతిరేకించాలో దేన్ని బలపర్చాలో వారికి తెలియదన్నారు. అయితే మరోవైపున తమ పార్టీ నాయకులపై అంతకంటే తీవ్రమైన విమర్శలు చేశారు. మూస ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల పరిస్థితికి తగినట్టు స్పందించలేకపోతున్నారని సూటిగానే చెప్పేశారు. హౌదాలు పదవులు ఇచ్చింది పనిచేయడానికేనని గుర్తు చేశారు.ప్రజలు ఓట్టేయకపోతే ఇవేవీ వుండవని కూడా కుండబద్దలు కొట్టి చెప్పారు. అమరావతి స్టార్టప్‌ వేడుకలో ఎన్నికల నాటికి ఎంతో కొంత చూపించాలని సింగపూర్‌ మంత్రిని కోరినప్పుడు కూడా ఇలాటి అభద్రతే కనిపించింది. ముఖ్యమంత్రి మాటలకు మంత్రులు ఎంఎల్‌ఎలు ఒకింత చకితులైనట్టు క్లిప్పింగ్స్‌ చూస్తే తెలుస్తున్నది. మరి హౌరాహౌరీ పోరాట మధ్యంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? వైసీపీతో బిజెపి పొత్తు పెట్టుకోవచ్చన్న వూహాగానాలు ఆయనపై ప్రభావం చూపిస్తున్నాయా? నిరంతర సర్వేలు అంత అనుకూలంగా రావడం లేదు గనకే ఇలా విసుక్కుంటున్నారని కొందరు సన్నిహితుల కథనం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close