మోడీ అడుగుజాడలలో నడుస్తున్న చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా ఎదుర్కొనే కొన్ని విమర్శలలో ఆయన విదేశీ పర్యటనలు కూడా ఒకటి. ఆయన సగటున నెలకొకసారి విదేశాలకి వెళ్లి వస్తుంటారు. ఆయన తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రెండేళ్లలో సింగపూర్, జపాన్, చైనా, అమెరికా తదితర దేశాలకి వెళ్లి వచ్చారు. ఆయన పర్యటనల ప్రధానోద్దేశ్యం రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమలు రప్పించడం. ఆశించిన ఫలితాలు మాత్రం రాకపోయినా, ప్రత్యేక విమానాలలో అధికారులని, మంత్రుల్ని వెంటబెట్టుకొని విదేశీపర్యటనలు చేసిరావడానికి రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది. నిన్ననే ఆయన బృందం చైనా పర్యటన ముగించుకొని విజయవాడ తిరిగి వచ్చింది. మళ్ళీ జూన్ 9న రష్యా ప్రయాణానికి సిద్దం అవుతున్నారు. అది కూడా పెట్టుబడుల కోసమే. యధాప్రకారం ఆయనతో ఒక డజను మంది బయలుదేరి వెళతారు. కనుక మళ్ళీ వారి యాత్రకి ఖజానాలో నుంచి ఒకటో రెండో కోట్లు తీసి ఖర్చుపెట్టక తప్పదు.

ముఖ్యమంత్రి రష్యా పర్యటన ఖరారు అయింది కానీ ఇంకా పూర్తి షెడ్యూల్ ఖరారు కావలసి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించవచ్చు. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశః ఇన్నిసార్లు అధికారికంగా విదేశీ పర్యటనలు చేసి ఉండరేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close