బాధతో సరిపెట్టిన బాబు

అభివృద్ధి వేగంలో ఆంధ్ర ప్రదేశ్‌తో తెలంగాణకు పోలికే లేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేసిన వ్యాఖ్య తనకు బాధ కలిగించినట్టు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కెసిఆర్‌ మాటలపై చంద్రబాబు స్సందించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. ఇది కూడా విమర్శగానో వివాదంగానో గాక బాధతో సరిపెట్టడం విశేషం. నిన్న చెప్పుకున్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో కెసిఆర్‌ మాటలలో కొంత నమ్రత లోపించిన మాట నిజమే. తెలంగాణ అభివృద్ది గురించిన అతిశయోక్తులు ఎంత అనేది ఒకటైతే అదంతా ఈ మూడున్నరేళ్లలోనే జరగలేదని అందరికీ తెలుసు. హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాననే చంద్రబాబ మాటల్లో కొంత ఆత్మస్తుతి వున్నా కొంత నిజం కూడా వుంది గనకే కెటిఆర్‌ కూడా ఒప్పుకున్నారు. కాని నిజాం కాలంలో జరిగిన దాన్ని ఒప్పుకునే టిఆర్‌ఎస్‌ అధినేత టిడిపి హయాంలో జరిగిన భాగాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు. పైగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు నాశనమై పోయిందనే పాట కూడా వినిపిస్తుంటుంది.ఈ నేపథ్యంలో కెసిఆర్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన వూహించదగిందే. అందరూ అభివృద్ధి చేశారని 1995 తర్వాత అంటే తన పాలన మొదలైనాక పరిస్థితికీ అంతకుముందుకు మధ్య ఏది ఎలా వుండో పరిశీలిస్తే అంతా అర్థమైపోతుందని ఆయన అన్నారు. మరోవైపున విభజనప్రక్రియల్లో అన్యాయాలు వగైరా గురించి మళ్లీ చెప్పారు. హైదరాబాద్‌ కారణంగా ఆదాయంలో వ్యత్యాసాలున్నాయని అందిరకీ తెలుసు. అయినా ఎపితో పోల్చడమే తప్పయినట్టు కెసిఆర్‌ అనడం గాని దాంతోనే మళ్లీ పాత గాయాలు కెలుక్కోవడం గాని అనవసరం. కాకుంటే ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది ఇరు రాష్ట్రాల నేతలూ ప్రాంతీయ కోణాలు మళ్లీ ముందుకు తేవడం మాత్రం అనివార్యం. ఇరువైపులా ప్రజలు వాటిని ఓడించేందుకు సిద్ధంగా వుండాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close