డిల్లీకి చేరుకున్న ఛోటా రాజన్

అనేక తీవ్ర నేరాలకు పాల్పడి గత రెండు దశాబ్దాలుగా పోలీసులకి చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న మాఫియా గ్యాంగ్ లీడర్ ఛోటా రాజన్ గత నెల 26వ తేదీన ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయంలో పోలీసులకు పట్టు బడ్డాడు. అప్పటి నుంచి అతనిని భారత్ కి తిరిగి తీసుకువచ్చేందుకు సిబీఐ, ముంబై క్రైం బ్రాంచ్, డిల్లీ స్పెషల్ పోలీస్ మరియు విదేశాంగ శాఖ అధికారులు కలిసి చేసిన కృషి ఫలించింది. అతనిని ప్రత్యేక విమానంలో ఈరోజు డిల్లీకి తీసుకువచ్చేరు. ఇవ్వాళ్ళ తెల్లవారుజామున ఐదు గంటలకు డిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాడు.

అతనిని సిబిఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నకిలీ పాస్ పోర్ట్ కేసులో ప్రశ్నిస్తారు. వారి విచారణ ముగుసిన తరువాత అతనిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకి అప్పగిస్తారు. అతనిపై సుమారు 70కి పైగా కేసులున్నాయి. 55ఏళ్ళు వయసు గల ఛోటా రాజన్ అసలుపేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్జి. తనను ముంబైకి తరలిస్తే ముంబై పోలీసులు తనను తప్పకుండా హత్యచేస్తారని రాజన్ ఆరోపించాడు. ముంబై పోలీసులలో తన బద్ధ శత్రువయిన దావూద్ ఇబ్రహీం మనుషులు కూడా ఉన్నారని రాజన్ చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. 1993 ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళలో అనేక మంది మరణానికి కారకుడయిన ఛోటా రాజన్ పోలీసులకు పట్టుబడగానే ఇప్పుడు ప్రాణభయం పట్టుకొన్నట్లుంది. భారత్ లో పోలీసుల విచారణ పూర్తి కావడానికి, న్యాయస్థానాలు తీర్పు చెప్పడానికి చాల సమయం పట్టవచ్చును. కానీ ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి చివరికి ఏ గతి పడుతుందో అందరూ చూసారు. బహుశః ఛోటా రాజన్ కి కూడా అదే గతి పట్టవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close