దర్శకుడికి రవితేజ స్వీట్ వార్నింగ్!

‘టచ్ చేసి చూడు’ విడుదలకు ఇంకో ఆరు రోజులు మాత్రమే టైముంది. ఆల్రెడీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ జనాల్లోకి వచ్చాయి. రెగ్యులర్ రవితేజ సినిమా టైపులో, స్టయిలిష్ టేకింగులో ట్రైలర్ ఉందని టాక్ వినబడుతోంది. మాస్ మహారాజ్ ఫాన్స్ ఎలాగో సినిమాకి వస్తారు. రెగ్యులర్ ఆడియన్స్ కూడా సినిమాకి రావాలంటే ఇందులో ఇంకా ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని భావించాలి. ‘టచ్ చేసి చూడు’లో అటువంటి సంథింగ్ స్పెషల్ ఎలిమెంట్ ఒకటి ఉందట. ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు ఉన్నట్టు ఉండకుండా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ టచ్ చేశాడు. దాన్ని ఫినిష్ చేసే ఛాన్స్ మాత్రం రవితేజ ఇవ్వలేదు.

“మా దర్శకుడికి పెళ్లి కాలేదు. అందుకని ఎక్కువ ఆలోచించి చెడగొట్టాడు. రవితేజతో అతని కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి ఒక సీన్ చేయించాడు. అది చూసి నేను కుళ్ళుకున్నా. అదేంటో నేను చెప్పను. దర్శకుణ్ణి అడగండి” అన్నాడు. “రవితేజగారు ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చేయనటువంటి ఒక సన్నివేశాన్ని హాలీవుడ్ స్థాయిలో చేయించారని మేం విన్నాం” అని యాంకర్ సుమ చెప్పింది. స్టేజి మీదున్న దర్శకుడు విక్రమ్ సిరికొండ అదేంటో చెప్పబోతుంటే… రవితేజ ‘చెప్పవద్దు’ అని కింద నుంచి సైగలు చేశాడు. అక్కడితో చాఫ్టర్ క్లోజ్. “రవితేజ నుంచి చెప్పొద్దని వార్నింగ్ వచ్చింది. అదేంటో మీరు సినిమాలో చూడండి” అన్నాడు ఛోటా కె. నాయుడు. రవితేజ, రాశీ ఖన్నాలపై మాంచి రొమాంటిక్ సీన్ ఒకటి తీశారని టాక్! సినిమా చూస్తే అదేంటో తెలుస్తుంది. అప్పటివరకు సస్పెన్స్ తప్పదు. ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసే ఉద్దేశంతో సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నట్టున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.