రోహిత్ హత్యపై ఇద్దరు ముఖ్యమంత్రులు మౌనమేల?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మృతిపై రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. “అతని మృతిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు? బజారుకెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి తీరిక ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రోహిత్ తల్లిని ఎందుకు పరామర్శించలేదు? నిత్యం మోడీని, బీజేపీని విమర్శించే మంత్రి కె.టి.ఆర్. రోహిత్ మృతి గురించి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? పైగా రోహిత్ మృతికి కారకుడని భావిస్తున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అరెస్ట్ చేయడం మాని ఆయన రక్షణ కోసం 500 మంది పోలీసులను ఎందుకు నియమించారు?” అని పిసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ నిన్న మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని, ఆయన పార్టీ నేతలని నిలదీశారు.

“ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఇద్దరు కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. కానీ ఆమె తండ్రి సోదరుడు మాత్రం ఈ విషయంపై పెదవి విప్పరు. మొదట ఆమె తన తండ్రి కేసీఆర్, సోదరుడు కె.టి.ఆర్.లను దీనిపై నోరు విప్పి మాట్లాడమని చెపితే బాగుంటుంది. రోహిత్ మృతిపై అందరూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న తెరాస నేతలు, ఈ సంఘటనపై తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి,” అని దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేసారు.

రోహిత్ మృతిపై రెండు రాష్ట్రాలలోని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ స్పందిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆ తరువాత విమర్శలు రావడంతో దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై విచారం వ్యక్తం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు రోహిత్ తల్లిని, సోదరుడిని కలిసి ఓదార్చారు. వారి కుటుంబానికి రూ.5లక్షల నగదు, వారిరువురికీ రాష్ట్రంలో ఏదయినా కళాశాలలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చేరు. కనుక రోహిత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గానే స్పందించిందని భావించవచ్చును.

ఈ వ్యవహారంలో బీజేపీ మంత్రుల పేర్లు వినిపిస్తున్నందున, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా మౌనం వహిస్తోందంటే అర్ధం చేసుకోవచ్చును. కానీ బీజేపీతో నిత్యం పోరాడుతున్న మంత్రి కె.టి.ఆర్.,తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్,తెరాస నేతలు కూడా సరిగ్గా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటనపై మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close