ధూళిపాళ్లకు కరోనా…!

సంగం డెయిరీలో అక్రమాలంటూ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్రకు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల నుంచి ఆయనకు మైల్డ్ సింప్టమ్స్ ఉండటంతో  ఆయనకు టెస్టులు చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టెస్టులు చేయించడంతో పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పాజిటివ్ వస్తే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన రోజున..  వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రోజున కరోనా టెస్ట్ కూడా చేశారు. అప్పుడు నెగెటివ్‌గా తేలింది. 

ఇప్పుడు జైల్లోనో… పోలీసులు విచారణ పేరుతో అటూ ఇటూ తిప్పడం వల్లనో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. కరోనా అంటించడానికే టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసి.. తిప్పుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో… నరేంద్రకు పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. అదుపులోకి తీసుకున్న రోజున.. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకూ నెగెటివ్ వచ్చింది.. కానీ ఆయన రెండు రోజుల నుంచి కరోనాతో బాధపడుతున్నారు. ఆయన కుటుంబసభ్యులు కోర్టులో పిటిషన్లువేసుకుని చికిత్స కోసం.. ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మరో నిందితుడు..మాజీ సహకార శాఖ రిజిస్ట్రార్ గుర్నాధంకు మొదటి రోజు పాజిటివ్ వచ్చింది. 

అయితే ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్ వచ్చిందని ఆయననూ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తానికి అసలు కేసే లేదని… తప్పుడు కేసులు పెట్టి…టీడీపీ నేతలకు కరోనా అంటించడానికే.. విచారణల పేరుతో తిప్పుతున్నారని దేవినేని ఉమలాంటి నేతలు ఆరోపిస్తున్న సమయంలో…  నరేంద్రకు పాజిటివ్‌గా తేలింది. దీనిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close