ఎంసెట్ పరీక్షల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు

ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ తెలంగాణా ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట కలిగించే విషయమే. దానిలో కొందరు మంత్రులు, తెరాస నేతలు, అధికారుల పాత్ర కూడా ఉందని మీడియాలో వస్తున్న వార్తల వలన ఇంకా అప్రదిష్ట, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది. ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని కొందరు, వద్దని..దాని వలన వేలాది మంది విద్యార్ధులు నష్టపోతారని మరికొందరు చేస్తున్న వాదనలతో అయోమయ పరిస్థితి నెలకొని ఉంది.

ఒకవేళ ఎంసెట్ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలనుకొంటే, ఇదివరకు పరీక్షలు వ్రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్ధులు నష్టపోతారు. నిర్వహించకుంటే, ఇంత పెద్ద తప్పు జరిగిన తరువాత కూడా ఏమీ జరుగనట్లుగా మెడికల్ కాలేజీలలో సీట్లు భర్తీ చేస్తే ఇంకా విమర్శలు, న్యాయపరమైన చిక్కులు, ప్రభుత్వానికి ఇంకా అప్రదిష్ట కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎంసెట్-2ని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. కానీ నిర్ణయం ప్రకటించే ముందు న్యాయ నిపుణులని మరొకమారు సంప్రదించాలని నిర్ణయించుకొన్నారు. మళ్ళీ భవిష్యత్ లో మరెన్నడూ ఈవిధంగా జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రుల్ని, అధికారులని ఆదేశించారు. సోమవారం దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎంసెట్-3 నిర్వహించడం ఖాయంగానే కనిపిస్తోంది కనుక విద్యార్ధులందరూ మళ్ళీ ఆ పరీక్షలకి సిద్దం కావడం మంచిది.

రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంసెట్-3ని సమర్ధంగా నిర్వహించవచ్చు. ఆ తరువాత పరిస్థితులు చక్కబడవచ్చు. కానీ ప్రభుత్వ అసమర్ధత లేదా అశ్రద్ధ లేదా కొందరి అవినీతి కారణంగా ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట ఏర్పడింది. విద్యార్ధులకి చాలా నష్టం జరిగింది. కనుక ఒకవేళ మంత్రులు, నేతలు, అధికారులు ఎవరైనా దీనికి బాధ్యులని గుర్తించినట్లయితే వారిని సస్పెండ్ చేసి, అదే వారికి విధించిన గొప్ప శిక్ష అని చేతులు దులుపుకోకుండా, ఇటువంటి నేరానికి పాల్పడినందుకు అందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టి చట్ట ప్రకారం వారికి శిక్షలు పడేలా చేయగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వం దాని చిత్తశుద్ధి చాటుకొన్నట్లవుతుంది. దీనికి బాధ్యులైన వారు ఎంత పెద్ద వారైనప్పటికీ వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. దానిని ఆచరణలో పెడితే మళ్ళీ ఇటువంటి నేరాలు చేసేందుకు ఎవరూ సాహసించరు. అప్పుడే తెరాస ప్రభుత్వంపై పడిన ఈ మచ్చ తొలగిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close