పవన్ కళ్యాణ్ జనాన్ని తోసుకుంటూ వెళ్లి ఓటు వేశాడు అన్న విమర్శల్లో వాస్తవం ఎంత?

ఎన్నికల వేళ మీడియా, సోషల్ మీడియా చాలా చురుగ్గా ఉంటుంది. ఏ పార్టీ నాయకుడు ఏ చిన్న తప్పు చేసిన ప్రత్యర్థి పార్టీలను అభిమానించే మీడియా దాన్ని హైలెట్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంటుంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకునే సందర్భంలో జనాన్ని తోసుకుంటూ వెళ్లాడంటూ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ఒక కథనాన్ని వెల్లడించింది. దీంతో వైఎస్సార్సీపీ అభిమానులు, జగన్ను ఆరాధించే వెబ్ సైట్లు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద నిన్న ఈ అంశం పై నెగటివ్ కథనాలు వెలువరించాయి. అయితే అక్కడ నిజానికి ఏం జరిగింది.

పవన్ కళ్యాణ్ పోలింగ్ బూత్ కు చేరుకొని, ముందు కాసేపు క్యూలైన్లో నుంచున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ క్యూలో నించున్న కారణంగా గా పోలింగ్ బూత్ లో వాతావరణం మొత్తం మారిపోయింది. పరిస్థితి గమనించిన ఆఫీసర్స్, పరిస్థితి చేయి దాటక ముందే, ఇతర ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం , పవన్ కళ్యాణ్ ని తామే వచ్చి లోపలికి రమ్మని ఆహ్వానించారు. దీంతో పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా, అప్పుడు కూడా అభిమానులు పవన్ కళ్యాణ్ వద్దకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పవన్ కళ్యాణ్ పోలింగ్ అధికారులతో పాటు నేరుగా లోపలికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిపోయాడు.

అయితే ఈ సంఘటనను సాక్షి వక్రీకరించిన తీరు మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం. పోలింగ్ అధికారులు పవన్ కళ్యాణ్ ని లోపలకు ఆహ్వానించిన విషయాన్ని, తమతో పాటు తీసుకెళ్లిన విషయాన్ని దాచి పెట్టి, పవన్కళ్యాణ్ నిజంగా జనాల్ని తోసుకెళ్లినట్లు గా ఎటువంటి వీడియో చూపించకుండానే చేసిన కథనాలు ప్రజలను విస్మయ పరుస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close